మహబూబ్నగర్, మే 23 : ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవె న్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా, మండల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదు నూ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారమార్గం చూపాలన్నారు. అలాగే పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందు కు సాగాలన్నారు. ప్రజావాణిలో భూసమస్యలపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, భూసమస్యలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూ చించారు. అనంతరం ఇద్దరు దివ్యాంగులకు శిశు, మహిళా, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సమకూర్చిన ట్రైసైకిల్స్ను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నం దలాల్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ర్టావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
రాష్ర్టావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ మాట్లాడారు. జూన్ 2న రాష్ర్టావతరణ దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించనున్నట్లు తెలిపారు. వేడుకలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరవుతారని చెప్పారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అ నంతరం పోలీస్ ఫరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆ విష్కంచనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్ నందలాల్ పవార్ ఉన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
జెడ్పీ సమావేశ మందిరంలో 29న నిర్వహించనున్న మిల్లెట్స్-మిద్దెతోట ప్రకృతి వ్యవసాయ సదస్సుకు సంబంధించిన పోస్టర్ను కలెక్టరేట్లో కలెక్టర్ వెంకట్రావు ఆవిష్కరించారు. రైతులోకం ఫౌండేషన్, సీనియర్ సిటిజన్ ఫోరం, ఆస్క్ ఎడ్యుకేషన్ సొసైటీ, కోఆపరేటివ్ ఆర్గానిక్ స్టోర్ సహకారంతో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్థోపెడిక్ డాక్టర్ రాంకిషన్, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్, వైస్చైర్మన్ శ్యామూల్, కోశాధికారి జగపతిరావు, ముకుందారెడ్డి, డీఎంహెచ్వో కృష్ణ పాల్గొన్నారు.