నాగర్కర్నూల్, మే 21 : దళితులు ఆర్థికాభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందులో భాగంగానే దేశంలో ఎక్కడాలేని విధంగా దళితులకోసం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళితబం ధు ద్వారా మంజూరైన ఏడుగురు లబ్ధిదారులకు కార్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బంగారు తెలంగాణలో దళితులందరూ ఆర్థికాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు కార్యక్రమాన్ని ప్రా రంభించాన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షలతో మీ కాళ్లపై మీరు నిలబడి ఆర్థికంగా ఎదగాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణం గా నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని 100 కుటుంబాలను ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఎంపిక చేసిన వంద కుటుంబాలకు పారదర్శకంగా దళితబంధు అందజేయడం జరుగుతుందన్నారు. దళితబంధుకు ఎంపికైన లబ్ధిదారులందరూ ప్రతిపైసాను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక ‘దళితబంధు’ విజయానికి ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా సహకరించాలని కోరారు. కాగా బిజినేపల్లి మండలానికి చెం దిన ముగ్గురికి, అంతారం గ్రామానికి చెందిన ఒకరికి, బొం దపల్లికి చెందిన ఒకరికి, అవురాసిపల్లికి చెందిన ఇద్దరికి కార్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీటీవో ఎర్రిస్వామి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి రాంలాల్, ము న్సిపల్ చైర్పర్సన్ కల్పన, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మ య్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హన్మంతురావు, సింగిల్విండో చైర్మన్ బండారు శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ చిక్కొండ్ర శ్రీశైలం, బిజినేపల్లి ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.