కొల్లాపూర్, మే 21 : ఈనెల 20వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘అడవిలో అక్రమసాగు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. కాగా, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం కొల్లాపూర్ పట్టణానికి చెందిన హరిత ప్రేమికుడు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ స్వర్గంశ్రీనివాస్కు వాట్సాప్లో ఫిర్యాదు చేశారు. ‘నమస్తే తెలంగాణ’లో శుక్ర, శనివారాల్లో ప్రచురితమైన వార్త క్లిప్పింగ్లను షేర్ చేశాడు. కోడేరు మండలం నర్సాయిపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో 60 ఎకరాల్లో తొలగించిన నీలగిరి వృక్షాలను బొగ్గుబట్టీల యజమానులకు విక్రయించడం చట్టరీత్యా నేరమని, రాష్ట్ర స్థాయి విజిలెన్స్ టీంతో విచారణ జరిపించాలని ఫిర్యాదుదారుడు కోరాడు.