గద్వాల న్యూటౌన్, మే 21 : బ్యాంకుల వద్ద కాపుకాసి నగదు డ్రా చేసుకొని వెళ్తున్న ఖాతాదారుల దృష్టి మరల్చి చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జోగుళాంబ గద్వాల ఎస్పీ రంజన్ రతన్కుమార్ తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కా ర్యాలయంలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నగరి మండలంలోని కు ప్పం గ్రామానికి చెందిన మేకల సాల్మన్, గోగుల జానుతో కలిసి బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసుకొని వెళ్తున్న వ్యక్తులను టార్గెట్ చేసి చోరీలకు పా ల్పడుతున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 5న అయి జ ఆంధ్రా బ్యాంకులో రామాంజనేయులు రూ. 1.92 లక్షలు డ్రా చేసుకొని బైక్పై వెళ్తున్నాడు. అ ప్పటికే మాటు వేసిన నిందుతులు బైక్ పంచర్ అ య్యిందంటూ రామాంజనేయులుతో చెప్పి వా హనం నిలిపిన తరువాత క్షణాల్లో నగదును అపహరించారు.
గత నెల 19న గద్వాల ఎస్బీఐ నుం చి కుంపటి నాగేశ్ రూ.3.50 లక్షలు డ్రా చేసుకొని బైక్పై వెళ్తుండగా.. డబ్బులు కింద పడ్డాయని ఏ మార్చి డబ్బులు దొంగిలించారు. ఈ నెల 11న ఇ టిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలోని యూనియన్ బ్యాంకులో కుర్వ మద్దిలేటి రూ.1.50 లక్ష లు డ్రా చేసుకొని బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మద్దిలేటి షర్ట్పై నిందితులు పౌడర్ చల్లి.. ‘మీ షర్ట్పై పౌడర్ పడింది’ అంటూ మద్దిలేటి దృషి మరల్చి నగదు అపహరించారు. బాధితుల ఫిర్యా దు మేరకు ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమో దు చేసుకొని పలు రాష్ర్టాల్లో గాలింపు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులు చిత్తూరు జిల్లా కుప్పం గ్రామంలో ఉన్నట్లు గుర్తించి.. శనివారం తెల్లవారుజామున అలంపూర్ సీఐ సూర్యానాయక్, గద్వాల రూరల్ ఎస్సై ఆనంద్, సిబ్బంది సాయంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో సైతం చోరీలు చేసేవారని ఎస్పీ తెలిపారు.
నిందితుల నుంచి రూ.3,50 లక్షలు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.
కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ రంగస్వామి, సీఐలు సూర్యానాయక్, షేక్ మహబూబ్ బాషా, ఎస్సైలు ఆనంద్, హరిప్రసాద్రెడ్డి, సిబ్బంది రంజిత్, ప్రసాద్, చంద్రశేఖర్, ఐటీ సెల్ నాగరాజు, చందు, రామకృష్ణలను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.