నారాయణపేట టౌన్, మే 21 : ఈనెల 23 నుంచి ప్రా రంభం కానున్న పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిచందన తెలిపారు. శనివారం పట్టణంలోని కలెక్టర్ కా ర్యాలయంలో ఆమె మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీ సుకురాకూడదని పేర్కొన్నారు. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.
పరీక్షలు నిర్వహించే సమయంలో జిరాక్స్ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్లు మూసివేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసేలా అధికారులను ఆదేశించామన్నారు. పరీక్షా కేంద్రాల్లో శానిటేషన్తోపాటు ప్రథమ చికి త్స కోసం ఏఎన్ఎంలను నియమించినట్లు ఆమె పేర్కొన్నా రు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 7893701990 సంప్రదించాలని, డీఈవో లియాఖత్ అలీ 9440232039 నెం బర్, ఆర్టీసీ కో ఆర్డినేటర్ 7382828085 నెంబర్, ఎంఈవోలు గోపాల్నాయక్ 9966986214, వెంకటయ్య 949 1387900, అంజలిదేవి 9502441389, లక్ష్మీనారాయ ణ 7702775332 నెంబర్లను సంప్రదించవచ్చన్నారు. వి ద్యార్థులు ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.