ఊట్కూర్, మే 20 : పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సర్వ త్రా సిద్ధమయ్యారు. ఈనెల 23 నుం చి 28వ తేదీ వరకు నిర్వహించాల్సిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు తీ సుకుంటున్నారు. ఊట్కూర్ జిల్లా ప రిషత్ బాలురు, బాలికల ఉన్నత పా ఠశాల, ఈఎస్డబ్ల్యూఆర్ఈఎస్, పు లిమామిడి, పెద్దజట్రం, చిన్నపొర్ల, బిజ్వారం జెడ్పీహెచ్ఎస్, పులిమామిడి కేజీబీవీ, ఊట్కూర్, చిన్నపొర్ల జిల్లా పరిషత్ ఉర్దూ మీడియం, మిల్లత్ ఉ ర్దూ మీడియం ఉన్నత పాఠశాలలకు చెందిన 347 మంది బాలికలు, 229 మంది బాలురు పరీక్షలకు హాజరు కాబోతున్నారు. విద్యార్థుల అవసరం మే రకు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్న త పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, పులిమామిడి కేజీబీవీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మొ త్తం 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొ త్తం 576 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వసతులను ఏర్పాటు చేశారు.
శుక్రవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలతో పాటు వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు హాల్ టికె ట్ల పంపిణీ చేపట్టారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక చీ ఫ్ సూపరింటెండెంట్తోపాటు డిపార్ట్మెంట్ అధికారి, ఇన్విజిలేటర్ల నియామకం చేపట్టారు. ఉద యం 9:30 నుంచి 12 :45 వరకు పరీక్ష నిర్వహించనున్నారు.