నారాయణపేట టౌన్, మే 20 : జూన్ 3 నుంచి 18వ తేదీ వరకు చేపట్టే పల్లె, పట్టణ ప్రగతి పనులను పకడ్బందీ గా నిర్వహించాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో పల్లె, పట్ట ణ ప్రగతి నిర్వహణ, సన్నద్ధతపై అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతిలో మండలాలకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చే యాలని ఆదేశించారు. గ్రామాల్లో ఇప్పటికే గ్రామ కమిటీల ను ఏర్పాటు చేశామన్నారు. మండల ప్రత్యేక అధికారులు సమావేశాలు నిర్వహించి 15 రోజులపాటు నిర్వహించే కా ర్యక్రమాలను తెలియపర్చాలన్నారు. గ్రామాలు, మండలా లు, మున్సిపాలిటీల్లో పర్యటించి పనులను గుర్తించాలన్నా రు. వైకుంఠధామాలను వినియోగంలోకి తీసుకురావాలని, వసతులు పర్యవేక్షించి నివేదికలు సమర్పించాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్రీడా ప్రాంగణాల కోసం స్థ లాలను పరిశీలించాలన్నారు.
రాష్ట్రస్థాయి అధికారులు, ప్ర జాప్రతినిధులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించే అవకా శం ఉన్నందున గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత అధికారులదేనన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని, బృహత్ ప్రకృతి వనాల కోసం స్థలాలు గుర్తించాలని ఆమె చెప్పారు. హరితహారం లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమావేశంలో అదన పు కలెక్టర్లు చంద్రారెడ్డి, పద్మజారాణి, డీఈవో లియాఖత్ అలీ, డీఎఫ్వో వీణావాణి, జెడ్పీ సీఈవో సిద్ధిరామప్ప, బీసీ సంక్షేమాధికారి కృష్ణమాచారి, పౌర సరఫరాల శాఖ అధికారులు శివప్రసాద్రెడ్డి, హతీరాం నాయక్, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.
ధాన్యాన్ని తిరస్కరించొద్దు…
వరి కొనుగోలు కేంద్రాల నుంచి రైతులు మిల్లులకు తీసుకొచ్చిన ధాన్యాన్ని తిరస్కరించొద్దని కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మిల్లర్ల అసోసియేషన్ సభ్యులతో ధాన్యం సేకరణపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఇప్పటికే అకాల వర్షాలతో నష్టపోతున్నార ని, మిల్లర్లు ఖాళీ స్థలం లేదని, గోదాములు లేవని చెప్పి ధా న్యం తీసుకోము అనడం సరికాదన్నారు. కొన్ని రోజులుగా రైతులు తమ కల్లాల్లో ధాన్యాన్ని ఆరబెట్టడం జరుగుతుందని, మార్కెట్ యార్డులు, ఐకేపీ సెంటర్ల నుంచి వరిని కొ నుగోలు చేస్తున్నారని ఆమె చెప్పారు. కొనుగోలు చేసిన ధా న్యాన్ని మిల్లర్లు వెంటనే తీసుకోవాలని, లేని పక్షంలో మిల్లర్లపై వేటు తప్పదన్నారు. తరుగు తగ్గించకుండా ధాన్యం తీ సుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, పౌర సరఫరాల శాఖ అధికారులు శివప్రసాద్రెడ్డి, హతీరాంనాయక్, మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.