జడ్చర్ల/నవాబ్పేట, మే 19 : అకాలవ ర్షం అన్నదాతలను ఆగం చేస్తున్నది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాలవర్షంతో తడిసి ముద్దవుతున్నది. ఆరబెట్టిన ధాన్యం వర్షపునీటిలో కొట్టుకుపోయి అన్నదాతకు తీరని వ్యథ మిగులుస్తున్నది. నవాబ్పేట మండలంలోని వివిధ గ్రామాల్లో గు రువారం కురిసిన భారీ వర్షంతో అన్నదాత కు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలకేంద్రంతోపాటు యన్మన్గండ్ల, లోకిరేవు, లింగంపల్లి, కిషన్గూడ, అమ్మాపూర్, కొల్లూరు, దేపల్లి తదితర గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి ధా న్యం పూర్తిగా తడిసిపోయింది.
కొల్లూరు గ్రామశివారు లో రైతులు లింగం, వెంకటేశ్గౌడ్, వెంకటయ్య, భగవాన్నాయక్ ధాన్యాన్ని ఆరబెట్టగా, అకాల వర్షానికి నీటిలో కొట్టుకుపోయింది. రైతులు ధాన్యా న్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడినా ఫలి తం లేకుండాపోయింది. అదేవిదంగా జడ్చర్ల పత్తి మార్కెట్యార్డులో మరికల్కు చెందిన రైతుల వెంకట్రాంరెడ్డి 300 బస్తాల ధాన్యాన్ని ఆరబెట్టగా, అకాలవర్షానికి కొట్టుకుపోయింది. అకాలవర్షంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.