మక్తల్ టౌన్, మే 19 : ‘మన ఊరు-మన బడి’ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి ఆదేశించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మక్తల్, మాగనూర్, కృష్ణ, నర్వ, ఊట్కూ ర్ మండలాల్లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ను మెరుగుపర్చుకోవడానికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించేందుకు వీలుగా మొదటి విడుతలో ప్రారంభించిన పనులు వేగవంతం చేయాలని అన్ని మండలాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడుతలో మక్తల్, మాగనూర్, కృష్ణ, నర్వ మండలాలో 45 పాఠశాలలను ఎంపిక చేశామని, అన్ని పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రారంభించామని, పనులు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా నేషనల్ రూరల్ గ్యారెంటీ స్కీంతో కంపౌండ్ వా ల్స్, టాయిలెట్స్, యూరెనల్స్ వంటి నిర్మాణాలను చేపడుతున్నారన్నారు. ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఏఈలు, సర్పంచులు పాఠశాలలను పర్యవేక్షించి పనులు త్వరగా చే పట్టేందుకు కృషి చేయాలన్నారు.
పాఠశాలల్లో ఎలక్ట్రికల్స్, మైనర్ పనులు, కొత్త గదుల నిర్మాణాలను ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్లు పూర్తి చేయించుకోవాలన్నా రు. గ్రామస్థాయి నుంచి పట్టణస్థాయిలో అన్ని ప్రభుత్వ పా ఠశాలల్లో విద్యార్థుల చదువుకు ఆటంకం కాకుండా మౌలిక వసతులు కల్పించి, ప్రతి పేద విద్యార్థి ఇంగ్లిష్ విద్య అభ్యసించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంఈవో లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ మక్తల్ మం డల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, మక్తల్ ఎంపీడీవో శ్రీధర్, ఎంపీవో పావని, టీఆర్ఎస్ ఊట్కూర్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నర్వ మండల అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, ఎంపీడీవోలు పాల్గొన్నారు.