మరికల్, మే 19 : ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అ దనపు డైరెక్టర్ అమర్సింగ్ నాయక్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానను క్షుణ్ణంగా పరిశీలించారు. వై ద్యులతో మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రత పాటించే వి ధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ద వాఖాన పనితీరు బాగుందన్నారు. మలేరియా, డెంగీ వ్యా ధులు ప్రబలకుండా దవాఖాన సిబ్బంది తగిన జాగ్రతలు తీసుకోవడంతోపాటు అందుకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
తాత్కాలిక పద్ధతిలో కుటుంబ నియంత్రణ పాటించాలి
కుటుంబ నియంత్రణ కోసం తాత్కాలిక పద్ధతిని అవలంబించాలని అమర్సింగ్ నాయక్ తెలిపారు. ప్రసూతి అయిన తర్వాత దవాఖానలో నియంత్రణ ఇంజక్షన్, ఐ యూసీడీ తదితర వాటిని వేసుకోవాలన్నారు. కుటుంబ ని యంత్రణ కోసం ఆపరేషన్లు అవసరం లేదన్నారు. దవాఖాన బయట వర్షం నీరు నిలువడంతో ఆసంతృప్తి వ్యక్తం చేశారు. నీరు ని లువడం వల్ల దోమలు ప్రబలే అవకాశం ఉందని, వెంటనే పంచాయతీ సిబ్బందితో గుంతలను పూడ్చాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ వెం కటేశ్, సైదులు, అశోక్కుమార్, భిక్షపతి, వై ద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
కీటక జనిత వ్యాధుల నియంత్రణకు చర్యలు
నారాయణపేట టౌన్, మే 19 : కీటక జనిత వ్యాధుల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని అమర్సింగ్ నాయక్ సూచించారు. పట్టణంలోని జిల్లా వైద్య ఆరోగ్య శా ఖ కార్యాలయంలో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బందితో గురువారం జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పరిసరాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. దోమల వల్ల వచ్చే మలేరియా, డెంగీ, మెదడు వాపు ఫైలేరియా తదితర వ్యాధులను నివారించేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పీహెచ్సీల వారీగా తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. సమావేశం లో డీఎంహెచ్వో రామ్మనోహర్రావు, డిప్యూటీ డీఎంహెచ్వో శైలజ, ప్రోగ్రాం అధికారి రవీందర్ లఖావత్, మాస్ మీడియా అధికారి హన్మంతు, వైద్యులు పాల్గొన్నారు.