హన్వాడ, మే 19 : దళితబాంధవుడు సీఎం కేసీఆర్ అని దళిత సంఘాల నాయకులు కొనియాడారు. దళితబంధు పథకం యూనిట్లను నియోజకవర్గానికి 1500 చొప్పున పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం హన్వాడ గ్రామపంచాయతీ కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం సం తోషంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చాక అన్నివర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయకార్యదర్శి జంబులయ్య, టీఆర్ఎస్ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రధానకార్యద ర్శి ఆంజనేయులు, సర్పంచులు వెంకన్న, చెన్నయ్య, రా ములు, వెంకటయ్య, సురేందర్, గంగాపురి, యాదయ్య, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.