మహబూబ్నగర్, మే 19 : వాహనాల ఫిట్నెస్ రెన్యువల్పై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు హేయనీయమని టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ అన్నారు. మోట రు వాహన చట్టం సవరణపై నిరసన వ్యక్తం చేస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కేంద్ర ప్రభు త్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనాల ఫిట్నెస్ రెన్యువల్ చేయకపోతే రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధించడం సరికాదన్నారు. మోటరు వాహన చట్టంలో మార్పులు తీసుకొస్తూ జారీ చేసి న 714 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డి మాండ్ చేశారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలతోపాటు డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ నాయకులు పాల్గొన్నారు.
ఆటోల బంద్ విజయవంతం
జడ్చర్లటౌన్, మే 19 : వాహనాల ఫిట్నెస్పై కేంద్ర ప్రభుత్వ నిబంధనలను నిరసిస్తూ జడ్చర్లలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోల బంద్ పాటించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, యజమానులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ లక్ష్మీనారాయణ, సీఐ రమేశ్బాబుకు వినతిపత్రం అందజేశారు. వాహనాల ఫిట్నెస్పై ఫెనాల్టీలు విధించడంతో ఆటో నడుపుకునేవారు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆ సంఘం అధ్యక్షుడు హాజీ పేర్కొన్నారు. అదేవిధంగా లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.