కోస్గి, మే 19 : మున్సిపాలిటీలో అ త్యవసర కౌన్సిల్ సమావేశం గురువా రం చైర్పర్సన్ శిరీష అధ్యక్షతన నిర్వహించారు. పట్టణ ప్రగతిలో చేపట్టాల్సి న పనులపై చర్చించారు. పనులపై తీ ర్మానం చేసి 16 వార్డులకుగానూ రూ. 16లక్షలను కేటాయిస్తూ తీర్మానం చే శారు. అనంతరం మార్కెట్ సమీపం లో మున్సిపల్ కాంప్లెక్స్లో దుకాణాల టెండర్లపై చర్చించారు. ఒక్క దుకాణానికి రూ.రెండు లక్షలు డిపాజిట్ చేసి టెండర్లో పాల్గొనేందుకు మరో రూ.50వేలు డీడీ తీసి డిప్పులో పాల్గొనవచ్చని, డ్రిప్పులో దుకాణం రానివారికి డబ్బులు తిరిగి ఇచ్చేలా ప్రణాళికలు తయారు చేయాలని నిర్ణయించారు. కాగా మీడియాను గతంలో ఎప్పుడు లేని విధంగా కౌన్సిల్ సమావేశంలోకి రావద్దని కమిషనర్ పూర్ణచందర్ అంక్షలు పెట్టడంపై సర్వత్రా చర్చసాగుతున్నది.