గద్వాల రూరల్, మే 19 : ఇంటర్ పరీక్షలు రా సి తండ్రితోపాటు కలిసి వెళ్తుండగా ఇద్దరిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. జోగుళాంబ గద్వాల జిల్లా అనంతపురం స్టేజీ సమీపంలో ఘ టన జరిగింది. ఏఎస్సై వెంకట్రాములు కథనం మే రకు.. ఇటిక్యాల మండలం మునగాల గ్రామానికి చెందిన నరేంద్ర అలియాస్ కుమ్మరి నల్లన్న, పద్మ మ్మ కూతురు రాజేశ్వరి(17) గద్వాల కేజీబీవీ కళాశాలలో ఎంపీసీ గ్రూపులో ఇంటర్ చదువుతుంది. గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ముగియడంతో ఆమెను తీసుకొచ్చేందుకు తండ్రి నరేంద్ర సొంతూరు నుంచి మోటర్ బైక్పై వెళ్లా. సాయంత్రం గద్వాల నుంచి స్వగ్రామానికి బైక్పై వస్తున్న వారిని అనంతపురం స్టేజీ దాటిన తర్వాత ఎర్రవ ల్లి నుంచి గద్వాల వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్ను ఢీ కొన్నది. దీంతో తండ్రీ కూతరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనా మా నిర్వహించి మృతదేహాలను ప్రభుత్వ దవాఖానకు తరలించారు.