అయిజ, మే 19 : 40కేజీల విడి పత్తి విత్తనాలను స్వా ధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన సం ఘటన పట్టణంలో చోటుచేసుకున్నది. గురువారం తెల్లవారుజామున వడ్డేపల్లి మండలం, తనగల గ్రామానికి చెందిన నరేశ్ సంకాపురం గ్రామానికి చెందిన మద్దిలేటి నుంచి 40కేజీల విడి పత్తి విత్తనాలను కొనుగోలు చేసి తనగల గ్రామానికి తీసుకెళ్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు.. శాంతినగర్ సీఐ శివశంకర్ ఆదేశాల మేరకు ఏవో శంకర్లాల్, టాస్క్ఫోర్స్ ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో కర్నూల్ చౌరస్తాలో తనిఖీలు చేపట్టారు. నరేశ్ వద్ద అనుమానాస్పదంగా విత్తనాలతో కూడిన సంచి ఉండటంతో అతన్ని వి చారించి అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శివశంకర్ తెలిపా రు.
అయిజ మండలం, సంకాపురం గ్రామానికి చెందిన మద్దిలేటి వద్ద నుంచి విత్తనాలు కొనుగోలు చేసినట్లు నరేశ్ చెప్పడంతో మద్దిలేటిని అదుపులోకి తీసుకుని విచారించిన ట్లు తెలిపారు. తన యజమానికి తెలియకుండా పత్తి విత్తనాలను దొంగిలించుకున్నట్లు మద్దిలేటి పేర్కొన్నారు. దొంగిలించిన విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నట్లు మద్దిలేటి వెల్లడించినట్లు సీఐ తెలిపారు. 40 కేజీల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఏఈవోలు ఉన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మే వ్యక్తి అరెస్టు
కోస్గి, మే 19: నకిలీ విత్తనాలు అమ్ముతున్న ఓ వ్యక్తిని వికారాబాద్ పోలీసులు కోస్గి మండలంలో గుర్తించి పట్టుకున్నారు. బుధవారం రాత్రి మండలంలోని తోగాపూర్ అ నుబంధ గ్రామం పందిరిహనుమన్లు గ్రామానికి చెందిన లక్ష్మయ్య వద్ద నకిలీ విత్తనాలు తీసుకెళ్తున్న వ్యక్తి వికారాబాద్ జిల్లా తాండూర్ పోలీసులకు చిక్కాడు. విషయం ఆ రా తీయగా కోస్గి మండలం నుంచి విత్తనాలు తెచ్చినట్లు చెప్పడంతో లక్ష్మయ్య ఇంట్లో పోలీసులు తనిఖీ చేసి అరెస్ట్ చేశారు.