కొల్లాపూర్, మే 15: మండలంలోని సోమశిలలో ఆదివారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సమక్షంలో 200మంది టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచం వ్యాప్తంగా చైనాలో తొలి కేబుల్ వంతెన తర్వాత సోమశిల కృష్ణానదిపై నిర్మించనున్న కేబుల్ వంతెన రెండోదిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. కల్వకుర్తి నుంచి వయా కొల్లాపూర్, సోమశిల-ఆత్మకూరు-కర్వెన వరకు నాలుగు లైన్ల జాతీయ రహదారితోపాటు కృష్ణానదిపై వంతెనకు సీఎం కేసీఆర్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపి మంజూరు చేయించుకున్నట్లు వివరించారు.
మాజీ వైస్ ఎంపీపీ హన్మంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ సర్పంచ్ రెడ్డిగారి వెంకటస్వామి, సందు ఆంజనేయులు, పెద్ద శంకర్, కుర్మయ్య, రెడ్డిగారి కుర్మయ్య, చిన్నశంకర్, ఆంజనేయులు, వార్డు సభ్యుడు రాజు, బాలరాజు, నర్సింహ, సున్నపు కుర్మయ్య, రెడ్డిగారి వెంకటస్వామి, అంకలి మద్దిలేటి, అంకలి వెంకటస్వామి, సున్నపు గంగన్న, కన్నయ్య, అంకలి రాముడు, జయరాములు, జనార్దన్, పర్వతాలు, రెడ్డిగారి శ్రీనివాసులు, అలివేలమ్మ, జయమ్మ, వరలక్ష్మి, పద్మతోపాటు మరో 175మంది మత్స్యకారులు ఉన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మతీన్అహ్మద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, పార్టీ మండల అధ్యక్షుడు రామచంద్రయాదవ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు తాళ్ల పరశురాంగౌడ్, మండల కోఆప్షన్ సభ్యుడు హరూన్పాషా, మాజీ సర్పంచులు వెంకటస్వామి, రంగస్వామి, ఉప సర్పంచ్ రవి, మల్లేశ్వరం సర్పంచ్ నాగరాజు, పట్టణ మాజీ ఉపసర్పంచ్ చంద్రశేఖరాచారి, పార్టీ నాయకులు కిషన్నాయక్, హెచ్ రాజేశ్, ఖాదర్పాషా, సాంబశివుడుయాదవ్, చంద్రశేఖర్శెట్టి, వేణుగోపాల్రెడ్డి, మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.