మహబూబ్నగర్, మే 15: ప్రజాసంక్షేమంపై ప్రతిపక్ష నేతలకు పట్టింపులేదని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం ఏర్పాటు చేసిన నూతన కమిటీ చైర్మన్, సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. ప్రతి వర్గానికి సామాజిక న్యాయం చేస్తున్నామని, దేశంలో మిగతా రాజకీయ పక్షాలు వారి ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. మహబూబ్నగర్ చరిత్రలో మొట్టమొదటిసారి మైనార్టీవర్గానికి చెందిన అబ్దుల్ రహెమాన్కు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించినట్లు తెలిపారు. కులాలను పక్కనపెట్టి గిరిధర్రెడ్డికి ఇస్తూ ప్రత్యేకస్థానం కల్పించినట్లు తెలిపారు.
హైదరాబాద్ తర్వాత అతిపెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నిజాయితీ పరుడైన వెంకన్నకు అవకాశం కల్పించినట్లు గుర్తుచేశారు. కొంతమంది రాజకీయ నాయకులకు అధికారం దూరం కావడంతో మతిభ్రమించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇన్నాళ్లుగా కాంగ్రెస్, బీజేపీ పాలిత రా ష్ర్టాల్లో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఎం దుకు అమలుకావడం లేదని ప్రశ్నించారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన అబ్దుల్ రహెమాన్, వైస్చైర్మన్ గిరిధర్రెడ్డి, డైరెక్టర్లు సాయిలు, శారద, కృష్ణయ్య, ఉమేశ్, ప్రకాశ్, రామకృష్ణ, శ్రీనివాసులు, సురేశ్, గోపాల్, విజయ్కుమార్, పీ శ్రీనివాసులు, పాండయ్య, సుధాకర్, గంగాధర్గౌడ్, సంజీవ్గౌడ్, పొలం శ్రీనివాసులు, బాలకిష్టయ్య, రాంచంద్రయ్య, వెంకటేశ్వర్లు, అల్తాఫ్, నరేందర్తో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నా రు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ గోపాల్యాదవ్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు కొరమోని వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్చైర్మన్ తాటి గణేష్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, నాయకులు అబ్దుల్హాదీ, అన్వర్పాషా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజేశ్, ఆంజనేయులు, మార్కెటింగ్ అధికారి సారిక తదితరులు పాల్గొన్నారు.
నాటకాలకు పునర్జీవం పోయాలి
సినిమా మోజుతో నాటకాలు అంతరించిపోతున్నాయని.. వాటికి పునర్జీవం పోసేందుకు సాంస్కృతికశాఖ ప్రయత్నిస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మున్సిపల్ టౌన్ హాల్లో స్వరలహరి ఆర్ట్స్ అకాడమీ 32వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ధర్మజ రాజసూయము, పద్యనాటక ప్రదర్శన, ద్వారక దృశ్యం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ నాటకరంగ కళాకారులను మంత్రి సన్మానించారు. ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, స్వరలహరి అకాడమీ ప్రతినిధి భాగన్నగౌడ్, పల్లెర్ల రామ్మోహనరావు, విశ్రాంత ఎంపీడీవో నారాయణ, బాద్మి శివ కుమార్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.