నాగర్కర్నూల్, మే 15 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూల్ జిల్లా సమగ్ర స్వరూపం గొప్ప సంకల్పమని, జిల్లాలోని అనేక అంశాలను సమీకరించి పుస్తకం రచించడం అభినందనీయమని, భవిష్యత్ తరాలకు దిక్సూచిలా పనిచేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు శివారెడ్డి అధ్యక్షతన నాగర్కర్నూల్ జిల్లా సమగ్ర స్వరూపం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమానికి మంత్రి నిరంజన్రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, జెడ్పీచైర్మన్ పద్మావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ జిల్లా సమగ్ర స్వరూపంలో చాలా అంశాలను పేర్కొనడం జరిగిందని, పుస్తకం తీసుకురావడం గొప్పవిషయమన్నారు. జిల్లాలోని అనేక విషయాలను రికా ర్డు చేయడం గొప్ప సాహసమని, ఆ పనిని సారస్వ త పరిషత్ చేపట్టడం భవిష్యత్తు తరాలకు అందించాల నే గొప్ప సంకల్పమన్నారు. రైల్వే లైన్లు, విమానాలు క ట్టిన శ్రమ జీవులు నాగర్కర్నూల్ ప్రజలేనని, గతం తెలియకుంటే భవిష్యత్ అంధకారమవుతుందన్నారు. నదులు వెలిసిన చోటే నాగరికత వెలుస్తుందన్నారు. నీళ్లు ప్రజల జీవన ప్రమాణాలను మారుస్తుందన్నారు. చరిత్ర ఆనవాళ్లపై కనీస పరిజ్ఞానం లేని వాళ్లు దేశాన్ని పాలిస్తున్నారన్నారు.
రాజ్యాంగానికి భిన్నంగా తిరోగమనం వైపు దేశాన్ని తీసుకెళ్తున్నారని, దీనిని సరిదిద్దే బాధ్యత కవులు, సాహిత్యకారులదన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని 33 జిల్లాలుగా విభజించిన స్ఫూర్తితో అన్ని జిల్లాల చరిత్ర, సంస్కృతీ, సాహిత్య కళలు, పురావస్తు కట్టడా లు, పర్యాటక ప్రదేశాలు తదితర అంశాలపై వ్యాసాలు రాయించి సమగ్ర స్వరూప గ్రంథాలు ముద్రించి జిల్లా ఉత్సవాలు నిర్వహించాలని తెలంగాణ సారస్వత పరిషత్ నిర్ణయించడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ పేదరికం నుంచి కవి పుడుతాడని, తన జీవిత అనుభవాల నుంచి కవిత్వం రాస్తాడన్నారు. జిల్లా రూపురేఖలు మార్చడం, సమస్యలు తీర్చడంలో కవులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఆడిటోరియం ఏర్పాటుకు సహకరిస్తానన్నారు.
ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ డబ్బు, అధికారం ఉంటుంది, పోతుంది కానీ చరిత్ర శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. ఏడేండ్లలో ఏం అభివృద్ధి జరిగిందనే అంశాలను సమగ్ర గ్రంథంగా తీసుకురావడం అభినందనీయయమన్నారు. బస్సు డిపో ఎదుట వచ్చే నెలలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జిల్లా గ్రంథాలయానికి శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందన్నారు. కపిలవాయి పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా తనవంతు కృషి చేస్తానన్నారు. నాగర్కర్నూల్ ట్యాంక్బండ్ను మరింత సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. నేను చదువుకోలేకున్నా పేదలకు మంచి విద్య అందించేందుకు సొంత డబ్బుతో ఒక్కో స్కూల్ రూ.3కోట్లతో నిర్మిస్తున్నానన్నారు. చదువుకుంటేనే ఉన్నతస్థాయికి ఎదుగుతారని తెలిపారు.
జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కవులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం కవులను తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు శివారెడ్డి శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్య, వనపట్ల సుబ్బయ్య, దినకర్, మోహన్, వెంకటేశ్వర్రెడ్డి, వీరయ్య, వహీద్ఖాన్, కమలేకర్, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్రెడ్డి, వీరయ్య, పద్మాలయాచార్య, ఉమ, సబిత, లక్ష్మి, భార్గవి, సాయిజ్యోతి, ఎదిరేపల్లి కాశన్న తదితరులు పాల్గొన్నారు.