నెట్వర్క్, నమస్తే తెలంగాణ, మే 15: పాలమూరులో నిర్వహించిన ప్రాపర్టీషోకు విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం వివిధ రియల్ ఎస్టేట్ రంగ దిగ్గజాల సహకారంతో షో నిర్వహించారు. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘టీ న్యూస్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షో విజయవంతంగా ముగిసింది. ‘రియల్’ వ్యాపారులు, బ్యాంకర్లు, నిర్మాణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఇండ్లు, అపార్ట్మెంట్లు, ప్లాట్ల కొనుగోలుపై అవగాహన కల్పించాయి. సొంతింటి కలను నిజం చేసేందుకు వేదికను ఏర్పాటు చేసిన ‘నమస్తే తెలంగాణ’కు అటు ప్రముఖుల నుంచి.. ఇటు వినియోగదారుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.