నాగర్కర్నూల్, మే 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యా యజ్ఞంలో ఉపాధ్యాయులు, ప్రజలు భాగస్వాములు కావాలని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా మేడిపూర్, గగ్గలపల్లి గ్రామాల్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా రూ.1.94 కోట్లతో చేపట్టనున్న పాఠశాలల అభివృద్ధి పనులకు ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, ఎమ్మెల్సీలు కూచకుళ్ల దామోదర్రెడ్డి, కాటేపల్లి జనార్దన్రెడ్డి, రాష్ట్ర అధికారులతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించడం కోసం అప్పులు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల బోధన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బడులను కూడా గుడుల్లా పవిత్రంగా చూడాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నేడు ఉన్నత చదువుల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. విద్యారంగంలో రాష్ర్టాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రం లో విద్యా యజ్ఞం కొనసాగుతున్నదని విద్యాశాఖ మం త్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా సర్కార్ బడుల్లో కార్పొరేట్ స్థాయిలో విద్య, మౌలిక వసతులు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు చె ప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా మేడిపూర్, గగ్గలపల్లి గ్రామాల్లో మన ఊరు-మన బడి కింద రూ.1.94 కోట్లతో చేపట్టనున్న పాఠశాలల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మర్రి జ నార్దన్రెడ్డి, ఎంపీ రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బా లరాజు, జెడ్పీచైర్పర్సన్ పద్మావతి, ఎమ్మెల్సీలు కూచకుళ్ల దామోదర్ రెడ్డి, కాటేపల్లి జనార్దన్రెడ్డి, రాష్ట్ర పాఠశాలలు, మౌలిక సదుపాయాల సంస్థల చైర్మన్ శ్రీధర్రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ దేవసేన, కలెక్టర్ ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్ మనూ చౌదరి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి కలిసి మంత్రి శంకుస్థానలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లోని పేదలు వారి పిల్లల ను ఇంగ్లిష్ మీడియం చదివించాలని తపన పడుతుంటారని చెప్పారు. వారి కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల బోధన ప్రారంభించాలని నిర్ణయించారన్నారు. సర్కార్ బడులను తక్కువ అంచనా వేయొద్దని.. అక్కడ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధన ఉంటుందని వివరించారు. విద్యారంగంలో రాష్ర్టాన్ని నెంబర్వన్ స్థానంలో నిలిపేందుకు చర్యలు తీ సుకుంటున్నట్లు తెలిపారు. పాఠశాలల అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని సూచించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 26 వేల స్కూళ్లను ఎంపిక చేసి రూ.7,300 కోట్లతో పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలోనే రూ.103 కోట్లతో పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో 65 శాతం ఉన్న అక్షరాస్యతను వంద శాతానికి తీసుకెళ్లాలని కోరారు. బడి ఈడు పిల్లలంతా పాఠశాలల్లోనే ఉండాలన్నారు. రాబోయే ఐదేండ్లలో తెలంగాణ యువతే అధికంగా ఉన్నత స్థానాల్లో ఉంటారని చెప్పా రు. మహిళలు విద్యారంగంలో రాణిస్తున్నారని, ఉన్నత విద్యా సంస్థల్లో అధికంగా మహిళలే ఉంటున్నారని పే ర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో మహిళా యూనివర్శిటీ ఏర్పాటు చేయించారన్నారు. ఇంటర్, పదో తరగతి వి ద్యార్థులు ఇష్టపడి చదవాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్ర జలు పాఠశాలలను గుడులుగా పవిత్రంగా భావించాల ని సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఈ సెలవుల్లోనే స్కూళ్లల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యే లా చూడాలన్నారు. అంతకు ముందు విద్యార్థుల సాం స్కృతిక ప్రదర్శనలను తిలకించిన మంత్రి సభలో ప్ర సంగించిన విద్యార్థినులను అభినందించారు.
అనంత రం ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు, వసతులు కల్పించేందుకే మనఊరు-మన బడిని అమ లు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 8 ఏండ్లలో 33 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసినందుకు పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. తెలంగాణ పిల్లలకు మంత్రి స బితా తల్లిలా మారారన్నారు. పేదరికంతోనే తాను ఉన్న త విద్యను అభ్యసించలేదని, అందుకే సొంతంగా తి మ్మాజిపేట, సిర్సవాడ, తాడూరుల్లో సొంత డబ్బులతో స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. విప్ గువ్వల మాట్లాడుతూ నీటి పారుదల శాఖలో రికార్డు సృష్టించినట్లుగా సీఎం కేసీఆర్ విద్యశాఖను పటిష్టం చేసేందుకు తీసుకుంటున్న చర్యలకు చేతులెత్తి మొక్కాలన్నారు.
ప్రతి విద్యార్థి కలలు కనాలని, సాకారం చేసుకునేందుకు కష్టపడాలన్నారు. మాజీ మంత్రి మహేంద్రనాథ్ నాగర్కర్నూల్ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే మర్రి సొంతంగా స్కూల్ భవనాలు నిర్మిస్తూ ఆదర్శంగా నిలిచారన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ రాష్ట్రంలో 66 శాతం అక్షరాస్యత ఉంద ని, వందశాతానికి చేరుకోవాలన్నారు. తాను పశువుల కాపరిగా ఉంటే గ్రామ పెద్దలు చదవాలని ప్రోత్సహించారని, అందువల్లే తాను ఇప్పుడు ఈ స్థాయికి చేరానన్నారు. జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి మాట్లాడుతూ ప్రభు త్వ పాఠశాలల్లో మెరుగైన విద్యబోధనకు సర్కార్ చర్య లు తీసుకుంటున్నట్లు చెప్పారు.
విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, రాష్ట్ర పాఠశాలల చైర్మన్ శ్రీధర్రె డ్డి, కలెక్టర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఏర్పడుతుందన్నారు. ప్రతి పాఠశాల లో ఆంగ్లమాధ్యమంలో బోధన కోసం ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణలు పూర్తి చేస్తూ వచ్చినట్లు వెల్లడించారు. రూ.7వేల కోట్లతో పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నాటికి సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.