బల్మూరు, మే 7 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీకి కండ్లు మండుతున్నాయని, అందుకే సీఎం కేసీఆర్ గురించి తొండి మాటలు మాట్లాడుతున్నారని ప్ర భుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దుయ్యబట్టారు. శనివారం కొండనాగుల సింగిల్విండో కార్యాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీవో పంత్యనాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ త్వరలో బల్మూరు శివారులో రిజర్వాయర్ నిర్మించనున్నామన్నారు. నియోజకవర్గంలో 50 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని చూసిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. పచ్చబడ్డ ఉమ్మడి పాలమూ రు జిల్లాను చూసి ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు.
దేశం గురించి కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. వరంగల్ సభలో రాహుల్గాంధీ రైతుల అభివృద్ధి గు రించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశాడని, ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బండి మా టలు అసత్య మూటలుగా అభివర్ణించారు. అనంతరం చెన్నారం గ్రామానికి చెందిన మల్లమ్మకు బీమా చెక్కు అందజేశారు. క్రాప్లోన్ తీసుకునే రైతులు రూ.16లతో బీమా చేసుకుంటే ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.2 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అరుణ, విండో చైర్మన్ నర్సయ్య, జెడ్పీటీసీ లక్ష్మి, సీఈవో రాజవర్ధన్రెడ్డి, సర్పంచులు రవిచంద్రారెడ్డి, శివశంకర్, యూసుఫ్, ప్రియాంక గణేశ్, ఎంపీటీసీలు ఆంజనేయులు, పద్మావతి, విండో సభ్యులు, నాయకులు చుక్కారెడ్డి, చందు, శ్రీను, కరుణాకర్రావు, నాగేశ్వర్రావు, రామస్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.