మహబూబ్నగర్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు జోగుళాంబ గద్వాల జిల్లాలో మహిళల నుంచి నిరసన సెగ తగిలింది. పెట్రోల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు అందనంత ఎత్తుకు చే రి ప్రజలు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న తరుణంలో బండి పాదయాత్రపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటిక్యాల మండలం వేముల-షాబాద్ గ్రామాల మధ్యలో ఈ అంశంపై మహిళలు పాదయాత్ర వద్దకు వచ్చి నిరసన తెలిపా రు. వీరికి స్థానికులు, టీఆర్ఎస్ కార్యకర్తలు అండగా నిలిచారు. ధరల పెరుగుదలపై సమాధానం చెప్పి తీరాలని బండిని పట్టుబట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై బీజేపీ గూండాలు దాడి చేశారు. మహిళలను నెట్టేసి స్థానికులు, టీఆర్ఎస్ కార్యకర్తలను చితకబాదారు. అయిజకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కారులో వె ళ్తుండగా దాడికి దిగి రాళ్లు, కర్రలతో చితకబాదారు.
ఎందుకు కొడుతున్నారో చెప్పాలని, తానేం తప్పు చేశానని ప్రశ్నిస్తున్నా లెక్కపెట్టకుండా దాడి చేసి, కారును ధ్వంసం చేశారని అంజి వాపోయారు. మహిళలను రోడ్డుపై నిలబడకుండా భయభ్రాంతులకు గురిచేశారు. దేశవ్యాప్తంగా ధరలు పెంచి ప్రజల నడ్డీ విరుస్తున్న బీజేపీ సర్కార్ సమాధానం చెప్పలేక తమపై దాడికి దిగిందని స్థానికులు తెలిపారు. దాడి కారణంగా మహిళలు అక్కడికక్కడే టెంట్ వేసుకుని సిలిండర్లతో నిరసనకు దిగారు. బీజేపీ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. గ్యాస్ ధరలు పెంచడంతో కనీసం వంట చేసుకునే పరిస్థి తి కూడా లేకుండా పోయిందని, తిరిగి కట్టెల పొయ్యిపైనే వంటలు చేయాల్సి వస్తోందని వాపోయారు. పెట్రోల్ ధరలు పెరిగి వాహనాలు బయటకు తీసే పరిస్థితి లేదని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం సాధించారని పాదయాత్ర చేపట్టారు అంటూ మహిళలు, స్థానికులు ప్రశ్నించారు. బీజేపీ నాయకుల దౌర్జన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులకు నిరసనగా బీజేపీ ఫ్లెక్సీలను తగులబెట్టారు.
ఏం తినాలి.. ఎలా బతకాలి..
గ్యాస్ ధరలు పెరిగిన తర్వాత ఒక్క పూటే తినాల్సిన దుస్థితి ఏర్పడింది. అన్ని ధరలూ పెంచారు. మంచి నూనె రూ.200, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు భారీగా పె రిగిపోయాయి. మా లాం టి సామాన్యులు బతికే పరిస్థితే లేదు. సామాన్యుడికి భరోసా ఇవ్వకుండా యాత్రలు ఎందుకు చేస్తున్నారు. సమాధానం చెప్పి ఇక్కడి నుంచి కదలాలని డిమాండ్ చేసేందుకు వచ్చిన మహిళలను నెట్టేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన వారిపై బీజేపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారు.
– లలిత, జోగుళాంబ గద్వాల జిల్లా
తమకు అడిగే అధికారం లేదా..
గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో కట్టెల పొ య్యితో వంటలు చేసుకుంటున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ పాదయాత్ర చేస్తున్నాడని తెలిసింది. మమ్మల్ని ఇంత గోస పెడుతూ ఏం మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారని అడిగేందుకు వచ్చినం. కేం ద్రం తప్పులు చేస్తుంటే సామాన్యులకు ప్రశ్నించే అధికారం లేదా.. ప్రశ్నిస్తే బీజేపీ వాళ్లు దాడులకు దిగుతారా..? వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– మైబూనా, అయిజ
రాళ్లు, కర్రలతో దాడి చేశారు..
బీజేపీ సర్కార్ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు. ధరల పెంపు విషయంలో శాంతియుతంగా నిరసన తెలపాలని పాదయాత్ర వద్దకు వచ్చాం. ఎందుకు నిరసన తెలుపుతున్నారని తోసేయడమే కాకుండా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, ఆయన అనుచరులు కలిసి నాపై రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. అకారణంగా ఆపి కారును ధ్వంసం చేశారు. ఒళ్లంతా రక్తం కారి నా వదిలిపెట్టలేదు. బీజేపీ నాయకులు రౌడీల్లా వ్యవహరిం చారు. దాడులతోనే రాజకీయం చేయాలని చూస్తున్నది. ఇదేనా బీజేపీ విధానం..? – అంజి, టీఆర్ఎస్ నాయకుడు, అయిజ
పాదయాత్రను అడ్డుకోలేదు..
కేంద్రం వడ్లు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టింది. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచింది. వీ టన్నింటిపై ప్రశ్నించేందుకు వచ్చాం. గొడవ చేయాలని, పాదయాత్ర అడ్డుకోవాలని రాలేదు. దాడి చేసిన వాళ్లు స్థానికులు కాదు. ఎక్కడి నుంచో గూండాలను వెంట పెట్టుకొని పాదయా త్ర చేస్తున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు వచ్చాం అని చెప్పి.. దాడికి దిగడం ఎంత వరకు కరెక్ట్. ప్రశ్నించే వారిపై దాడి చేసి.. ఎవరూ ప్రశ్నించకుండా నోరుమూపిస్తామంటే నడవదు.
– రమణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, అలంపూర్