ఊట్కూర్, ఏప్రిల్ 9 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ‘మన ఊ రు- మన బడి’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అ న్నారు. మండలకేంద్రంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శ నివారం ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు. అం తకుముందు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫజల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి పర్చేందుకు సీఎం కేసీఆర్ రూ.7,700కోట్లు కేటాయించారని పే ర్కొన్నారు. నిధులతో పాఠశాలలకు అవసరమైన అన్ని వసతులు, విద్యార్థులకు మౌలిక సదుపాయాలను సమకూరుస్తామన్నారు. బడుల అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవాలని, పూర్వ విద్యార్థులు సైతం బడులను బాగు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. రూ.20లక్షలతో కాం పౌండ్ వాల్, పెయింటింగ్ వర్క్ చేపట్టనున్నట్లు ఎంఈవో వెంకటయ్య తెలిపారు. ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధుల ను ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో సన్మానించారు. కా ర్యక్రమంలో సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, ఎంపీపీ లక్ష్మి, జె డ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ఎంపీటీసీ పద్మ, మండల కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రహిమాన్, ఉపసర్పంచ్ ఇబాదుల్ రహిమాన్, పీఆర్టీయూ మండలాధ్యక్షుడు ల క్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షు డు లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెం కటేశ్గౌడ్, ఎస్ఎంసీ చైర్మన్ ఖాలిక్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పేదల జీవితాల్లో వెలుగులు
సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్లతో పేదలకు అందజేస్తు న్న ఆర్థికసాయం వారి జీవితాల్లో వె లుగులు నింపుతున్నాయని ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తిప్రాస్పల్లి, అవుసలోనిపల్లి, మొగ్దుంపూర్, పాతపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులకు ఎమ్మెల్యే చె క్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్ర తిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కల్యాణ లక్ష్మి లబ్ధిదారుల నుంచి డబ్బులు అశిస్తే ఎంతటివారినైనా సహించబోమని హెచ్చరించారు. కాగా, కొంత మంది ఆధా ర్ కార్డులో వయస్సు, ఇతర వివరాలను మార్చి పథకాన్ని దుర్వినియోగపరుస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆధార్ కార్డులో వివరాలు మార్చితే ఇబ్బందులకు గురికావాల్సి వస్త్తుందని హెచ్చరించారు.
ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరం
ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వ రంలాంటిదని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. మండలంలోని సంగంబండలో 10 మంది లబ్ధిదారులకు శనివారం కల్యాణలక్ష్మి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళల కోసం ప్రత్యేకంగా కల్యాణలక్ష్మి పథకం చేపట్టడం తో ఆడబిడ్డల పెండ్లుకు ప్రభుత్వం పెద్దన్న కానుగా ఇవ్వడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడ ఇలాంటి పథకాలు లేవన్నారు. కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణారెడ్డి, సు దర్శన్రెడ్డి, బాల్రెడ్డి, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
పేదల పెన్నిధి సీఎం కేసీఆర్
పేదల సంక్షేమానికి ఎల్లప్పుడు సీ ఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని పాతపల్లిలో ఐదు మంది లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ బాలచందర్, స ర్పంచ్ కృష్ణయ్య, ఎంపీటీసీ మాధవి, లబ్ధిదారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.