వెల్దండ, జనవరి 24: వెల్దండ మండలం మర్రికుంటతండా జీపీలో విచారణ అధికారిగా వచ్చిన డివిజనల్ పంచాయతీ అధికారి పండరీనాథ్కు చేదు అనుభవనం ఎదురైంది. మర్రికుంటతండా గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం, తీర్మానాలు లేకుండా పనులు చేస్తున్నారని, బెదిరించి బలవంతంగా చెక్కులపై సంతకాలు చేయించుకుంటున్నారని ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఇటీవల సర్పంచ్ శ్రీనునాయక్పై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు డీఎల్పీవో పండరీనాథ్ సోమవారం ఎంపీవో లాలయ్యతో కలిసి విచారణకు వచ్చారు. జీపీ భవనంలో విచారణ చేపట్టగా విచారణ అధికారిగా మీరొద్దంటూ వార్డు సభ్యులు పట్టుబట్టారు. గతంలో రూ.40 లక్షల దుర్వినియోగంపై విచారణ అధికారిగా వచ్చిన మీరు లంచం తీసుకొని తప్పదోవ పట్టించారని ఆరోపించారు.
డీఎల్పీవో తన వాహనానికి డీజిల్ అంటూ కొట్ర గేటు వద్ద రూ.1000 తీసుకున్నారని గ్రామానికి చెంది న రమేశ్నాయక్ ఆరోపించారు. మీరు విచారణ చేయొద్దంటూ ఫిర్యాదుదారులు పట్టుబట్టడంతో డీఎల్పీవో వెనుదిరిగారు. డీఎల్పీవో వద్ద విచారణ పత్రాలను ఉప సర్పంచ్ లాక్కోవడంతో సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య ఘర్షణ నెలకొన్నది. కార్యక్రమంలో కార్యదర్శి అంజనమ్మ ,వార్డు సభ్యులు ఉన్నారు.