నాగర్కర్నూల్, డిసెంబర్ 21 : గర్భిణుల ను రక్తహీనత నుంచి కాపాడి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రవేశపెట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ దేశానికే ఆదర్శమని ఎక్సైజ్, క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రాష్ట్రం లో రక్తహీనత ఎక్కువగా ఉన్న తొమ్మి ది జిల్లాల్లో బుధవారం వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, స్పీకర్ పోచా రం శ్రీనివాస్రెడ్డి వర్చువల్ పద్ధతిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రా రంభించారు. నాగర్కర్నూల్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ గర్భిణులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ కిట్లోని వస్తువుల ను గర్భిణులు మాత్రమే తిని.. తమ ఆరో గ్యం మెరుగుపర్చుకొని ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనివ్వాలని ఆకాంక్షించారు. ఒకప్పుడు నాగర్కర్నూల్ వాసులకు ఆరోగ్య సమస్య వస్తే మహబూబ్నగర్కు తీసుకెళ్లేవారని.., నేడు స్థానికంగానే కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త ర్వాత ఉమ్మడి జిల్లాలో మూడు ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నామన్నారు.
మూడు వైద్య కళాశాలలు కలిగిన జిల్లా దేశంలో ఎక్కడా లేదన్నారు. మొదటగా మహబూబ్నగర్ జిల్లా ఈ ఖ్యాతిని సాధించిందన్నారు. త్వరలోనే గద్వాల, నారాయణపేటలో సైతం వైద్య కళాశాలలు మంజూరయ్యాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వైద్య, నర్సిం గ్ కళాశాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. చిత్తశుద్ధి కలిగిన నాయకులు, ప్రభుత్వం ఉంటే ఇలాంటి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు వంటి పథకా లు దేశంలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు. ఉద్యోగులకు అత్యధిక జీతా లు చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. ప్రతి కుటుంబం ఏదో ఒ క సంక్షేమ పథకాన్ని పొందుతుందన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ ఒక తండ్రిలాగా ఆలోచించి గర్భిణుల ఆరోగ్యం కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అమలు చేశారన్నారు. ఇలాంటి మంచి ఆలోచనలు సీఎం కేసీఆర్కు మాత్రమే వస్తాయన్నా రు.
తల్లి ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. ధనవంతులు మాత్రమే తినగలి గే ప్రోటీన్ హార్లిక్స్ గర్భిణులకు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కిట్లు రెండు సార్లు అందజేస్తామన్నారు. ఇంటింటికీ వెళ్లి గర్భిణులు, బాలింతలకు సేవలందిస్తున్న ఆశవర్కర్లు, ఏఎన్ఎంలను అభినందించారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగేందుకు వారి శ్రమ ఎంతో ఉందన్నారు. ఈ సేవలను మరింత పెంచాలని కోరారు. అంతకుముందు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పోస్టర్ ను విడుదల చేసి గర్భిణులకు కిట్లు, ఏఎన్ఎంలకు చీరలను పం పిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఉదయ్కుమార్, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్, మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, గ్రంథాల య సంస్థ జిల్లా చైర్మన్ హన్మంతురావు, కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, డీఎంహెచ్వో సుధాకర్లాల్, దవాఖాన సూపరింటెండెం ట్ రఘు, మార్కెట్ కమిటీ చైర్మ న్ కుర్మయ్య తదిత రులు ఉన్నా రు.