మహబూబ్నగర్, డిసెంబర్ 21 : పాత కలెక్టరేట్ స్థలంలో సూపర్స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు గురువారం వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు రానున్నా రు. కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2:30కు మంత్రి హరీశ్రావు జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. ముందుగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ దవాఖానను పరిశీలించనున్నారు. అనంతరం సూపర్స్పెషాలిటీ ద వాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే నూతన కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు : కలెక్టర్
మంత్రి హరీశ్రావు పర్యటన సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకట్రావు సూచించారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తేజస్నందలాల్పవర్, డీఎంహెచ్వో శశికాంత్, అధికారులు పాల్గొన్నారు.