మహబూబ్నగర్ అర్బన్, డిసెంబర్ 20 : అన్ని కు లాలు సమానమే అని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. వృత్త్తులు క్రమంగా కులాలుగా మారాయని పేర్కొన్నారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శివశక్తినగర్లో నాయీబ్రాహ్మణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బసప్ప, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణయ్య, అశ్వని రవి, మల్లేశ్, ప్రభాకర్, నవకాంత్ ఆధ్వర్యంలో 300 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, మహిళా కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్వం వివిధ వృత్తుల ఆధారంగా కులాలుగా వర్గీకరించారని తెలిపారు. సమాఖ్య రాష్ట్రంలో ఓటు బ్యాంక్ కోసం కులాలను విడదీశారని గుర్తు చేశారు. కులాలకు రంగులు వేసి మాయమాటలతో మోసం చేయ డం ఇకనైనా మానుకోవాలని సూచించారు. సొంత స్థ లం ఉండి అర్హులైన వారికి రూ.3 లక్షల అందిస్తామని పేర్కొన్నారు. రజక, నాయీబ్రాహ్మణలకు ఉచిత విద్యుత్తోపాటు కమ్యూనిటీ భవనాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, కౌన్సిలర్ తిరుపతమ్మ, శివరాజ్, మాజీ కౌన్సిలర్ పురుషోత్తం, వెంకటేశ్, శ్రీనివాస్రెడ్డి, ప్రశాంత్, మోయిన్ అలీ ఉన్నారు.
అభివృద్ధిని చూసే బీఆర్ఎస్లోకి..
తెలంగాణలో సీ ఎం కేసీఆర్ హయాంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్త లు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మిడ్జిల్ మండలం దోనూరు గ్రామానికి చెందిన హొలియదాసు సంఘానికి చెందిన దాదాపు 60 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో ఎ మ్మెల్యే సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధిలో రాష్ట్రం ముందంజలో నిలిచిందని చెప్పారు.
పార్టీలకతీతంగా ‘సంక్షేమం’..
రాష్ట్రంలో పార్టీలకతీతంగా ప్రతి ఇంటిలోని అర్హులకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఏకైక నేత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మంగళవారం కేటీదొడ్డి మండలం కుచినెర్ల గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు 30 మంది జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. హరిజన చిన్న, పెద్ద హనుమంతు, సురేశ్, దేవేందర్, భీమయ్య, నర్సింహులు, సవారప్ప, చిన్ననర్సింహులు, వీరేశ్, జంగిలప్ప, యువరాజ్గౌడ్, జనార్దన్, ప్రసాద్గౌడ్ తదితరులు చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమం లో కేటీదొడ్డి మండల వైస్ ఎంపీపీ రామకృష్ణ, జెడ్పీటీసీ రాజశేఖర్, తిమ్మప్ప, రంగప్ప, ముని, కృష్ణ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ గూటికి పలువురు
తెమండలంలోని నడిగడ్డ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఈశ్వరయ్య, వార్డు సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్త లు 150 మంది ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎంపీటీసీ జంగయ్య, డీలర్ కృష్ణయ్య, వార్డు స భ్యులు భూపాల్, వడ్డెమాన్ ఈశ్వరయ్యతోపాటు కాంగ్రెస్ నాయకులు చేరిన వారిలో ఉన్నారు.