నవాబ్పేట, డిసెంబర్18 : మండలంలోని రెండు తండాలకు బీటీరోడ్లు మంజూరైనట్లు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేకులచౌడాపూర్ నుంచి గుబ్బడిగుచ్చతండా మీదుగా కిషన్గూడ వరకు బీటీరోడ్డు నిర్మాణానికిగానూ రూ.3కోట్లు మంజూరైనట్లు తెలిపారు. అలాగే కొల్లూరు నుంచి బట్టోనిపల్లితండావరకు బీటీరోడ్డు నిర్మాణానికి రూ.3కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. త్వరలోనే పనులను ప్రారంభిస్తామని తెలిపారు.
ఎంపీని పరామర్శించిన ఎమ్మెల్యే
మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి సోదరుడు, టీటీడీబోర్డు సభ్యుడు మన్నె జీవన్రెడ్డిని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరామర్శించారు. మన్నె శ్రీనివాస్రెడ్డి సోదరుడు, జీవన్రెడ్డి తండ్రి వెంకట్రాంరెడ్డి ఇటీవల మృతి చెందారు. ఆదివారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గురుకుంటలోని ఎంపీ స్వగృహానికి వెళ్లి పరామర్శించి సంతాపం తెలిపారు. ముందుగా మన్నె వెంకట్రాంరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దర్పల్లికి చెందిన మాజీ వీఆర్వో రాంరెడ్డి కుటుం బ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. అలాగే కాకర్జాల మాజీ సర్పంచ్ అబుల్అలీ తల్లిదండ్రులు మక్కాకు వెళ్తున్న సందర్భంగా వారిని సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, వైస్ఎంపీపీ సం తోష్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, ముడా డైరెక్టర్ చెన్నయ్య, సర్పంచులు గోపాల్గౌడ్, నర్సింహానాయక్, నాయకులు నాగిరెడ్డి, ప్రతాప్, మాజీ ఎంపీపీ శీనయ్య, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.