రాజాపూర్, డిసెంబర్ 14: మండలంలో అగ్రహారం పొట్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య భూమి వ్యవహారంలో ఈనెల 8న ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు ఘ ర్షణ పడ్డారు. ఈ ఘటనలో 9న ఇరు వర్గాల వ్యక్తులు పరస్పరం ఫిర్యాదులు చేయగా కేసులు నమోదైనట్లు డీఎస్పీ మహేశ్ తెలిపారు. ఈ విషయమై బుధవారం డీఎస్పీ మహేశ్ అగ్రహారంపొట్లపల్లి గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన అంజిరెడ్డి తన సొంతపొలం సర్వే నంబర్ 15లో ఓంప్రకాశ్, రాజుకు 2.17 గుంటలు ,తిర్మలాపూర్ గ్రామానికి చెందిన నవీన్ రెడ్డికి 37గుంటలు విక్రయించాడు.
భూమి కొన్న నవీన్రెడ్డి వర్గానికి చెందిన యాదయ్య జేసీబీ సా యంతో భూమి చదును చేస్తుండగా ఓంప్రకాశ్రాజు వర్గం దాడి చేసి గాయపర్చినట్లు ఫిర్యా దు చేశాడు. అదేవిధంగా ఓంప్రకాశ్రాజు కూడా తనతోపాటు, పొలంలో ప్రహరీ నిర్మిస్తున్న కూలీలపై దాడి చేయడంతో జేసీబీతో ప్రహరీ కూల్చారని నవీన్రెడ్డి వర్గంపై ఫిర్యాదు చేశారు. యాదయ్య ఫిర్యాదు మేరకు ఓంప్రకాశ్రాజుతోపాటు మరో ముగ్గురిపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, నవీన్రెడ్డి వర్గానికి చెందిన కొందరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఘర్షణకు కారణమైన భూమికి సంబంధించిన రికార్డుల సర్వే నివేదిక ఇవ్వాలని తాసిల్దార్ను డీఎస్పీ కోరారు. ఇట్టి భూమిని కొన్న ఓంప్రకాష్ రాజు స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాల ని డీఎస్పీ ఎదుట వాపోయాడు. అలాగే గ్రామానికి చెందిన కొందరు ఘర్షణ జరిగే సమయంలో ఊరిలో లేమని, తమపేర్లు కూడా రాశారని డీఎస్పీకి తెలిపారు. కార్యక్రమంలో సీఐ జములప్ప, ఎసై జయప్రసాద్ పాల్గొన్నారు.