జడ్చర్ల, డిసెంబర్ 14 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. బుధవారం మార్కెట్కు 1,665 క్వింటాళ్ల ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం అమ్మకానికి రాగా.. క్వింటాకు గరిష్ఠంగా రూ.2,441, కనిష్ఠంగా రూ.1,862, మధ్యస్తంగా రూ.2,052 ధర పలికింది. అలాగే 209 క్వింటాళ్ల హంసరకం రాగా.. గరిష్ఠంగా రూ.2,039, కనిష్ఠంగా రూ.1,666, 417 క్వింటాళ్ల పత్తి రాగా.. గరిష్ఠంగా రూ.8,409, కనిష్ఠంగా రూ.5,066, 237 క్వింటాళ్ల మొక్కజొన్న రాగా గరిష్ఠంగా రూ.2,243, కనిష్ఠంగా రూ.2,211 ధర పలికింది.
రూ.8,016 పలికిన కందులు..
నారాయణపేట టౌన్, డిసెంబర్ 14 : పేట వ్యవసాయ మార్కెట్ యార్డులో 453 క్వింటాళ్ల కంది కొనుగోళ్లు జరిగాయి. మార్కెట్కు 112 క్వింటాళ్ల తెల్ల కందులు రాగా.. గరిష్ఠంగా రూ.8,016, కనిష్ఠంగా రూ.7,900, 341 క్వింటాళ్ల ఎర్ర కందులు అమ్మకానికి రాగా.. గరిష్ఠంగా రూ.8 వేలు, , కనిష్ఠంగా రూ.6,711 ధర పలికింది. అలాగే 168 క్వింటాళ్ల హంస రాగా.. గరిష్ఠంగా రూ.1,969, కనిష్ఠంగా రూ.1,609, 792 క్వింటాళ్ల సోన రాగా… గరిష్ఠంగా రూ.2,416, కనిష్ఠంగా రూ.1,609 ధర పలికినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు.