మక్తల్, డిసెంబర్ 8 : మండలంలోని మంథన్గోడ్ స మీపంలో సీపన్న గుండ్లలో వెలిసిన దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. ఉత్సవా ల్లో జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ హాజరై స్వామివారిని ద ర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని పల్లకీ సేవలో ఊరేగించారు. అంతకుముందు భక్తు లు పెదసంఖ్యలో తరలివచ్చి స్వామివారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పా ర్టీ జిల్లా నాయకుడు ఆంజనేయులుగౌడ్, సర్పంచ్ మహదేవమ్మ, ఎంపీటీసీ సుమిత్ర, ఉపసర్పంచ్ కృష్ణయ్యగౌడ్ త దితరులు పాల్గొన్నారు.
కర్నిలో అన్నదానం
కర్నిలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నదాన కార్యక్ర మం ఏర్పాట్టు చేశారు. అంతకుముం దు స్వామివారి డోలారోహణ కార్యక్ర మం భక్తుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు. భజన సంకీర్తనలు, దిగంబర నామ స్మరణలతో ఆ లయ పరిసరాలు మార్మోగాయి. కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.