నారాయణపేట టౌన్, డిసెంబర్ 8 : ప్రభుత్వాలు అం దించే అవకాశాలను అందిపుచ్చుకొని యువత వ్యాపారం లో ఎదగాలని కలెక్టర్ శ్రీహర్ష పిలుపునిచ్చారు. పట్టణంలోని నైపుణ్య శిక్షణాకేంద్రంలో ప్రధానమంత్రి ఉపాధి క ల్పన పథకం (పీఎంఈజీపీ)పై గురువారం అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పీఎంఈజీపీ పథకానికి 18 నుంచి 45 ఏండ్లు వయ స్సు ఉన్న వారు అర్హులన్నారు. ఈ పథకంలో స్వయం ఉపా ధి కోసం 59 కోర్సులు ఉన్నాయని, 30 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడంతోపాటు నైపుణ్యం మేరకు ఉపాధి కల్పిస్తామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత యువత చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పి ఆర్థికంగా ఎదగాలన్నారు. ప థకంతో కుటుంబం నుంచి ఒక వ్యక్తి మాత్రమే ఆర్థిక సహా యం పొందేందుకు అర్హులని, ఆదాయ పరిమితి లేదన్నా రు. సేవా రంగంలో రూ.5లక్షలు పైబడి ప్రాజెక్టులు నెలకొల్పాలంటే అర్హులైన వారు కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉం డాలన్నారు. పథకానికి సంబంధించిన వెబ్సైట్లో అవసరమైన పత్రాలు జత చేసి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఇండస్ట్రియల్ జీఎం బాబు, డీఆర్డీవో గోపాల్నాయక్, జెడ్పీ సీఈవో జ్యోతి, ఎంపీడీవో లు, ఎంపీవోలు పాల్గొన్నారు.
ఈవీఎం భవనానికి పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేయాలి
ఈవీఎంలకు పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండేలా భవనాని కి భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారుల కు ఆదేశించారు. పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదాంను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదాం ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసి ఈ వీఎంలను భద్రపర్చేందుకు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల సెక్షన్ అధికారి జగదీశ్, తాసిల్దార్ దాన య్య, ఆర్ఐ శ్రీనివాస్, సర్వే అండ్ ల్యాండ్స్ అధికారి గిరిధర్, సర్వేయర్ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దాలి
మన ఊరు మన బడి-మన బస్తీ మన బడి కార్యక్రమం లో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులను సకాలం లో పూర్తి చేసి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం వీసీ నుంచి మన ఊరు మన బడి కార్యక్రమంపై సమీక్ష ని ర్వహించి మాట్లాడారు.
వీసీలో పాల్గొన్న కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడుతలో 168 పాఠశాలలు ఎంపిక చేశామని, అందులో రూ.30లక్షల కన్న తక్కువ బడ్జెట్ పరిధిలో ఉన్న 141 పాఠశాలల్లో పనులు సాగుతున్నాయన్నారు. మండలంలో 2 పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్ది డిసెంబర్ చివరి నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. పాఠశాలల నిర్వహణ, మరుగుదొడ్లు, పరిశుభ్రత కోసం నిధులను సద్వినియోగం చేస్తామన్నారు. సకాలంలో పనులను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. వీసీలో అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, పీఆర్ ఈఈ నరేందర్, ఆర్ఆండ్బీ డీఈ రాములు తదితరులు పాల్గొన్నారు.