నవాబ్పేట, నవంబర్ 29 : ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే తండాలు అభివృద్ధి చెందాయని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. నవాబ్పేట మండలం వెంకటేశ్వరతండా పంచాయతీలోని మామిడిచెట్టుతండాలో మంగళవారం గిరిజనుల గురువు భోజాభావాజీ ఆధ్వర్యంలో సేవాలాల్ మహరాజ్, మరియమ్మ యాడి (దుర్గామాత) ఆలయ నిర్మాణానికి మం గళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాతే గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకంతో ప్రజల జీవన ప్రమాణస్థాయి పెరిగిందన్నారు. మారుమూల తండాలకు సైతం బీటీరోడ్లు వేయించిన ఘనత ము ఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. త్వరలోనే పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేయనున్నట్లు వివరించారు.
మామిడిచెట్టుతండాలో సేవాలాల్ ఆలయం నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ మెండె లక్ష్మయ్య, వైస్ఎంపీపీ సంతోష్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, సర్పంచులు లక్షీ్ష్మబా యి, గోపాల్గౌడ్, వెంకటేశ్, కృష్ణయ్య, ఉపసర్పంచ్ భగవాన్నాయక్, టీఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి, సేవాలాల్ ఉ త్సవ కమిటీ మండల ఉపాధ్యక్షుడు ఆర్సీపూర్ శంకర్నాయ క్, ప్రతాప్, సేవ్యానాయక్, మెండె శ్రీను, రఘు, మాన్యానాయక్, కృష్ణాగౌడ్, నవనీతరావు, రఘుగౌడ్, మల్లయ్య, భగవాన్నాయక్, సామ్యానాయక్, తుల్చానాయక్, లక్ష్మణ్నాయక్, గోవింద్నాయక్, చంద్రియా పాల్గొన్నారు.