నారాయణపేట రూరల్, నవంబర్ 27 : నారాయణపే ట నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తానని, ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇం టికీ తీసుకెళ్లేలా కార్యకర్తలు కృషి చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని జాలాల్పూర్ ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం మం డల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి వి షయంలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి సెంటు భూమికి సాగు నీరు అందించమే లక్ష్యమన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త కుటుంబానికీ టీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం అనేక సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ ప్రతి ఇంటిలో లబ్ధిదారులు ఉన్నారన్నారు. గ్రామాల్లో పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాములు, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ అంజలీదేవి, సింగిల్విండో చైర్మన్ నర్సింహారెడ్డి, నా యకులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.