దామరగిద్ద, నవంబర్ 27 : మండలకేంద్రంలో ఏర్పా టు చేసిన ఓటరు నమోదు కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ శ్రీ హర్ష తనిఖీ చేశారు. నూతన ఓటరు నమోదు వివరాలు, తీసివేతలు తదితర వివరాలను బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. బీఎల్వోలకు తగిన సూచనలు అందజేశారు. కార్యక్రమంలో బీఎల్వోలు నర్సింహులు, మురుగయ్య, లలిత తదితరులు పాల్గొన్నారు.
కేంద్రాలను పరిశీలన
నారాయణపేట రూరల్, నవంబర్ 27 : మండలంలోని జాజాపూర్, సింగారం, అప్పక్పల్లి, అమ్మిరెడ్డిపల్లి, చిన్నజ ట్రం తదితర గ్రామాల్లో సాగుతున్న ప్రత్యేక ఓటరు నమో దు ప్రక్రియను ఆదివారం తాసిల్దార్ దానయ్య పరిశీలించా రు. 18 ఏండ్లు నిండిన యువతీయువకులు తప్పకుండా తమ పేర్లను పోలింగ్ బూత్ కేంద్రాల్లో నమోదుకు దరఖా స్తు చేసుకోవాలన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా కేంద్రాల వద్ద దరఖాస్తుల వివరాలను బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు.
వినియోగించుకోవాలి
ఊట్కూర్, నవంబర్ 27 : మండలకేంద్రంతోపాటు పరిసర గ్రామాల్లో బీఎల్వోలు నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆదివారం తాసిల్దార్ తిరుపతయ్య పరిశీలించారు. రెండు రోజుల నుంచి అందిన దరఖాస్తులను ఆయ న పరిశీలించారు. ఈక్రమంలో డిసెంబర్ 3, 4 తేదీల్లో ఓ టరు నమోదు నిర్వహించనున్నట్లు తెలిపారు. 18 ఏండ్లు నిండిన వారు కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్రారెడ్డి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.