నారాయణపేట రూరల్, నవంబ ర్ 27 : రక్తదానం మరొకరికి ప్రాణదానమని జెడ్పీటీసీ అంజలీదేవి అ న్నారు. మండలంలోని సింగారంలో మార్వాడి పంచ్ గ్రేటర్ హైదరాబా ద్, గోల్డ్ ఉదయ్ పేట బ్రాంచ్ సం యుక్త ఆధ్వర్యంలో ఆదివారం రక్తదానం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రా ణదానం చేసిన వారమవుతామన్నా రు. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయడం వల్ల వారి ప్రాణాలను కాపాడిన వారమవుతామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల్లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన ట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో డాక్ట ర్లు గోపాల్, కేశవులు, జనార్దన్, రమేశ్, సాయికుమార్, యువత తదితరులు పాల్గొన్నారు.
వీహెచ్పీ ఆధ్వర్యంలో…
మరికల్, నవంబర్ 27 : విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని విశ్వహిందూ పరిషత్ మండలాధ్యక్షుడు రాంప్రకాశ్ గు ప్తా తెలిపారు. బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కరసేవకుల జ్ఞాపకార్థం రక్తదాన శి బిరం నిర్వహించామన్నారు. 40 మంది యువత రక్తదానం చేశారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గోవర్ధన్, బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ నా యకులు అనిల్కుమార్రెడ్డి, కుమ్మరి రాజు, రాజే శ్, కొండన్న, మొగులప్ప, మల్లికార్జున్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.