మహబూబ్నగర్, నవంబర్ 26 : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-2023 కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఓటరు నమోదుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లో శనివారం ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరణించిన ఓటర్ల పేర్లు తప్ప మిగతా పేర్లను నేరుగా ఓటరు జాబితా నుంచి తొలగించకూడదని తెలిపారు. ఓటరు సవరణ, నమోదు ప్రక్రియపై ఆదివారం పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. రెండు కిలోమీటర్ల దూ రానికి మించి ఉండే పోలీంగ్కేంద్రాల పరిధిలో అవసరమైతే అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తుది ము సాయిదా ఓటరు జాబితా ప్రచురించినట్లు తెలిపారు. 3,339మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారన్నారు. మొత్తం 3,521మంది దరఖాస్తు చేసుకోగా, 168 దరఖాస్తులను వివిధ కారణాల దృష్ట్యా తిరస్కరించినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 9వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని తిరుమలదేవునిగుట్ట, పోలీస్లైన్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఓటరు నమోదుపై ఇంటింటికెళ్లి అవగాహన కల్పించాలని బీఎల్వోలను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీవో అనిల్కుమార్, జెడ్పీ సీఈవో జ్యోతి, తాసిల్దార్ పార్థసారధి, వివిధ పార్టీల నాయకులు లక్ష్మణ్, మహేశ్కుమార్, అంజయ్య, సాయిబాబా, సత్యంయాదవ్, సాదతుల్లా, శామ్యూల్ పాల్గొన్నారు.