ఆత్మకూరు, నవంబర్ 21:అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్కారును ప్రజలు ఆశీర్వదించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కోరారు. ఆత్మకూరులో సోమవారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు అభివృద్ధికి తానెప్పుడూ సహకారమందిస్తానన్నారు.
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్కారును ప్రజలు ఆశీర్వదించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కోరారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో సోమవారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ జిల్లాకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీ మేరకు రూ.50లక్షల నిధులతో చెరువుకట్ట నుంచి పెట్రోల్బంక్ కల్వర్టు వరకు సీసీ రోడ్డు, కల్వర్టుల నిర్మాణం, టీఎస్ఐడీసీ నిధులు రూ. కోటీ 50లక్షలతో ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్, డివైడర్, రూ. 3 కోట్లతో పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీరోడ్లు, సైడ్ డ్రెయిన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో రోడ్డు విస్తరణకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మకూరు అభివృద్ధికి తానెప్పుడూ సహకారమందిస్తానని, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సహకారంతోనే ప్రస్తుత అభివృద్ధి పనులు ప్రారంభమవుతున్నాయన్నారు. పట్టణంలో పారిశుధ్యం, పచ్చదనానికి ప్రజలు నిరంతరం సహకారమందించాలన్నారు. తద్వారా ఆరోగ్య తెలంగాణ సాధ్యపడుతుందన్నారు. అంతకముందు మున్సిపల్ చైర్పర్సన్ గాయిత్రియాదవ్, వైస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రవికుమార్యాదవ్ మంత్రి, ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కు మొక్కలు అందించి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, పీఏసీసీఎస్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్రెడ్డి, మార్కెట్యార్డ్ చైర్మన్ ఎస్.ఎ.రాజు, టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరేశ్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, తాసిల్దార్ సింధూజ, కమిషనర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారులకు పూర్వవైభవం
వనపర్తి, నవంబర్ 21: రాష్ట్రంలో మత్స్యకారులకు పునరర్జీవం వచ్చిందని, ఎండిన చెరువులకు మిషన్ కాకతీయతో జీవం పోసింది సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ముదిరాజ్లకు మంత్రి నిరంజన్రెడ్డి సోమవారం ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పిచ్చిచెట్లు, మురికి కంపతో పూడుకుపోయిన చెరువులు నేడు నీటితో కళకళలాడుతున్నాయని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కాళేశ్వరం నిర్మించి కాలువలతో చెరువులను నింపడంతో నిండుకుండల్లా ఉంటున్నాయన్నారు. మత్స్యకార కుటుంబాలకు టీఆర్ఎస్ పాలనలోనేనని న్యాయం జరిగిందని మంత్రి వివరించారు.