అలంపూర్, నవంబర్ 21 : నమ్మిన వారికి కొంగు బంగారమై.. కోరిన కోర్కేలు తీర్చే మ హిమాన్వితుడిగా నిత్యానందస్వామి ఆరాధింపబడుతున్నాడు. ఏటా కార్తీక అమావాస్య రో జున జీవ సమాధి ఆశ్రమం వద్ద భక్తులు, శిశ్య బృందం, సేవా సమితి ఆధ్వర్యంలో ఆరాధనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. కు లమతాలకతీతంగా నిర్వహించే ఉత్సవాలతో లింగనవాయి గ్రామంలో పండుగ వాతావర ణం నెలకొంటుంది. ఉత్సవాలకు ఉమ్మడి జి ల్లా నుంచే కాకుండా తమిళనాడు, ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. మూడురోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. కాగా, నిత్యానంద స్వామి జీవ సమా ధి (1959 నవంబర్ 30) అయినప్పటి నుం చి నేటి వరకు ఆశ్రమం వద్ద ఆరాధనోత్సవా లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆశ్రమం ట్రస్ట్ లో ఎల్ఐసీ రామదాసు, ముంబాయి రమ ణ, చిన్న మద్దిలేటి, సుధాకర్, గుప్తరామయ్య, రాముడు, నిత్యానందం, రాజ్యలక్ష్మి, బేతంచర్ల స్వామిశెట్టి, పూజారి కురుమూర్తి తదితర గ్రామ పెద్దలు కార్యక్రమాలు చేపడుతున్నారు. కార్తీక అమావాస్య సందర్భంగా బుధవారం నిర్వహించే ఆరాధనోత్సవాలకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నిత్యానందస్వామి కుటుంబ సభ్యులు మద్రాస్లో స్థిరపడగా.. ఏటా ఆరాధనోత్సవాలకు వచ్చి వెళ్తుంటారు.
కార్యక్రమాలు ఇలా..
22వ తేదీన కలశస్థాపన, దేవతల ఆహ్వా నం, లక్ష్మీ గణపతి హోమం, మధ్యాహ్నం ప్రసాద వితరణ, రాత్రి అఖండ భజన, 23 న ఉదయం 8 గంటలకు నవగ్రహహోమం, రాత్రి 9 గంటల నుంచి భజనలు, రుద్రాభిషేకములు, రుద్రహోమాలు, స్వామి వారి పాదుక పూజ, మహనీయుల సందేశం, భక్త బృందాలతో సంకీర్తనలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.నిత్యానంద స్వామి వారిచే స్వయంగా వెలసిన అర్ధనారీశ్వర స్వయంభూ శివలిండినికి అభిషేకాలు, అలంకారం, మహామంగళ హారతి, అన్నదానం ఉంటాయి.