జెండావిష్కరణ చేసిన నాయకులు
మక్తల్ టౌన్, నవంబర్ 21: ప్రపంచ మత్య్సకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మక్తల్ మత్య్స సహకార సంఘం భవనంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తల్ సహకార సంఘం అధ్యక్షుడు కోళ్ల వెంకటేశ్ కేక్ కట్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోరాటాల అనంతరం మక్తల్లో సహకార సంఘ భవన నిర్మాణం చేపట్టారని పేర్కొన్నా రు. వేడుకలకు పట్టణంలోని ముదిరాజ్ యువకులు భారీ సంఖ్యలో తరలిరావడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మత్స్యకారులకు అండగా ఉండడంతో మత్స్యకారులు చేపల పెంపకంలో ముందడుగులో ఉన్నారన్నారు. కార్యక్రమంలో మక్తల్ సహకార సంఘం సభ్యులు వాకిటి అంజయ్య, కావలి శ్రీహరి, సుకన్యాశేఖర్, కావలి కృష్ణ య్య, వల్లంపల్లి లక్ష్మణ్, నాగప్ప, కర్నె నాగప్ప, కట్ట వెంకటేశ్, వాకిటి శ్యాం, ఆంజనేయులు, పృథ్వీ, గుంతలి రవికుమార్ పాల్గొన్నారు.
మాగనూర్లో..
మాగనూర్ నవంబర్ 21: మాగనూర్ మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ముదిరాజ్ నాయకులు కలిసిబైక్ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాగనూర్ ముఖ్యకూడలిలో విశ్వ గురువు వేదవ్యాసుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం అభివృద్ధి, మత్స్య కారుల సంక్షే మానికి అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను వివరించా రు. కార్యక్రమంలో మత్స్యకార సంఘం అధ్యక్షుడు అంజనేయులు, సీనియర్ నాయకులు ఈశ్వరయ్య, కృష్ణయ్య, భరత్ ఉపాధ్యక్షుడు అనంద్ కార్యదర్శి నరేశ్, కోశాధికారి వెంకటయ్య, వాకిటి శ్రీనివాస్ వర్కుర్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
మద్దూర్లో..
మద్దూర్, నవంబర్ 21: మద్దూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ముదిరాజ్ మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. జెండావిష్కరణ అనంతరం నాయకులు మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేపల పంపిణీ సబ్సిడీతోపాటు వాహనాలు ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు.
గుండుమాల్లో..
గుండుమాల్, నవంబర్ 21: మండలంలోని అన్ని గ్రామాల్లో జెండావిష్కరణ నిర్వహించారు. కొమ్మూర్ గ్రామంలో బంటు హన్మంతు మాట్లాడుతు రాష్ట్రంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. ముదిరాజ్లకు చేపలు, వాహనాలు, మార్కెట్లు ఇలా అన్ని సౌకర్యలు కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బోయిని రఘు, ముదిరాజ్ నాయకులు, సర్పంచ్ కృష్ణయ్యగౌడ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కోస్గిలో..
కోస్గి, నవంబర్ 21: కోస్గి పట్టణంలోని తెలుగువీధిలో సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు అనంతయ్య జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు అన్నిరకాల ప్రోత్సాహం అందుతుందన్నారు. సంఘం నాయకులు ఐక్యంగా ఉండి వృత్తిని కొనసాగించుకోవాలన్నారు. ముదిరాజ్లు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమం లో సంఘం మండల అధ్యక్షుడు తుడుం శ్రీనివాస్, నాయకులు మాస్టర్ శ్రీనివాస్, వెంకటయ్య, తదితరులున్నారు.