పాలమూరు దినదినాభివృద్ధి చెందుతున్నది. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు సైతం వెలుస్తున్నాయి. పట్టణంలోని నాలాలు, రోడ్లను ఆక్రమించి ఇండ్లను నిర్మించారు. మా ఇల్లు.. మా ఇష్టం అన్న చందంగా వ్యవహారం తయారైంది. వరదలు వచ్చిన సమయంలో వర్షపునీరు వెళ్లలేక ఇండ్లను ముంచెత్తుతున్నది. ఈ వర్షాకాలంలో రామయ్యబౌలి , బీకే రెడ్డి కాలనీలు వరద ప్రాంతాలుగా మారాయి. దీంతో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశాల జారీ చేశారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులు అనుమతులు లేని ఇండ్లపై కొరఢా ఝుళిపించనున్నారు. భవిష్యత్లో నాలాలు, డ్రైనేజీలు కబ్జా కాకుండా సెట్బ్యాక్పై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 20 : మహబూబ్నగర్ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెం దుతున్నది. ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కృ షితో రోడ్లు, జంక్షన్ల విస్తరణ, మహబూబ్నగర్ చుట్టూ బైపాస్తోపాటు అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు కృషి చేశారు. ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో ఇంటి ని ర్మాణాలు పెద్దఎత్తున చేపడుతున్నారు. మహబూబ్నగర్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన నూతన కా లనీల్లో సైతం అభివృద్ధి చేస్తున్నారు.
కానీ, మహబూబ్నగర్ పట్టణంతోపాటు పలు వార్డులు, వి లీన గ్రామాల్లో అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. సెట్ బ్యాక్ లేకుండానే అంతా మా ఇ ష్టం అన్నట్లుగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నా రు. ఇంటి అనుమతులు లేకున్నా, కనీసం రో డ్డును వదలకుండా, సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు.
మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రోజురోజుకూ నాలా లు, డ్రైనేజీలు, రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు పుట్టగొడుగుల్లా చేపడుతున్నారు. గతంలో రామయ్యబౌలి, బీకేరెడ్డికాలనీతోపాటు పలు కాలనీల్లో నాలాలు కబ్జా చేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు జలమయమైన సంఘటనలు చవిచూశాం. రామయ్యబౌలి, బీకేరెడ్డికాలనీలు కాకుండా ముందే నాలాలు, డ్రైనేజీలు కబ్జాకాకుండా సెట్బ్యాక్పై దృష్టి సారిసే భవిష్యల్లో ఇలాంటి దుస్థితి ఏర్పడదని పట్టణవాసులు కోరుతున్నారు.
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో పెద్దఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారు. గతంలో ఇంటి అనుమతికి ఇబ్బందులు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్ బీపాస్ ద్వారా అనుమతికి అవకాశం కల్పించింది. దాని ప్రకారమే ఇంటి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. టాస్క్ఫోర్స్ బృందాలు వెళ్లి తనిఖీ చేసిన తర్వాత అనుమతి ఇవ్వాలి. కానీ, కొంత మంది ఇంటి యజమానులు ప్రత్యేక బృందం వచ్చిన సమయంలో సెట్బ్యాక్ చూపించి ఆ తర్వాత మళ్లీ సెట్బ్యాక్ లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు.
రెండేండ్ల కిందట దాదాపు 600 అక్రమ నిర్మాణాలు గుర్తించి కూల్చివేసి వదిలేశారు. ఇంకా పెద్దఎత్తున నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. డ్రైనేజీలు సైతం స్లాబులు వేసి మ్యాన్హోల్స్ ఏర్పాటు చేయకుండానే స్లాబు వేస్తున్నారు. దీంతో పారిశుధ్య కార్మికులు సైతం చెత్తను తొలగించలేని దుస్థితి ఏర్పడింది. రోడ్డుపైనే డిస్మెంటల్, రాళ్లు వదిలేయడంతో వాహనదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.
ఇంటి నెంబర్ కావాలం టే .. అనుమతి పత్రా లు, సెల్ఫ్ అసిస్మెంట్ చేసుకునే అవకాశం ము న్సిపాలిటీ కల్పించింది. కానీ, కొంతమంది దళారులు ఇంటి పత్రాలు లేకున్నా.. ఇం టి నెంబర్లను ఇస్తున్నారని ఆరోపణ లు వినిపిస్తున్నాయి. పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది వెళ్తే ఇం టి నెంబర్ చూపించడంతో వెనుతిరుగుతున్నారు. ఇ ప్పటికైనా అక్రమ ని ర్మాణాలు, కబ్జాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
మున్సిపల్ నిబంధనల మేరకు ఇంటి నిర్మాణాలు చేపట్టాలి. సెట్బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేపట్టొద్దు. నాలాలు, రోడ్లు ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. ఇలాంటివి ఎక్కడ ఉన్నా నా దృష్టికి తీసుకురావాలి. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం.
– ప్రదీప్కుమార్, మున్సిపల్ కమిషనర్, మహబూబ్నగర్