మహబూబ్నగర్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ పట్టణానికి డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ వస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయా న్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆదివారం కలెక్టర్ వెంకట్రావుతో కలిసి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి పాల్గొనే భారీ బహిరంగ స భకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సి ద్ధించక ముందే ఎంవీఎస్ గ్రౌండ్లో స్వరాష్ట్రం కోసం కేసీఆర్ సమావేశం నిర్వహించారని గుర్తు చేశారు.
మళ్లీ ఇక్కడే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నా రు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట కొలువై ప్రజలకు సేవలు అందించే విధంగా తీర్చిదిద్దిన ఘనత దేశంలో ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మించినట్లు తెలిపారు. ప్రజలకు ఎన్ని పనులు ఉన్నా ఒకే చోట పూ ర్తి చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. కలెక్టరేట్ కో సం హైవే పక్కన స్థలం లభించడం అదృష్టమని, ప్రజలందరికీ అందుబాటులో అధికారులు ఉండనున్నారని మంత్రి స్పష్టం చేశారు.
కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవం తో పాటు పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మించనున్న సూ పర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఒక్క ఏడాదిలో పను లు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామ ని చెప్పారు. బస్టాండ్ సమీపంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తె లిపారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టే వివిధ అభివృ ద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ నెలలోనే నర్సింగ్ కళాశాల ప్రారంభం అవుతుందన్నారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా అధికారులు ఉన్నారు.