జడ్చర్ల, జనవరి 4 : రాష్ట్రంలోని ప్రతి రైతు అన్ని విధాలుగా బాగుపడాలనే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అ మలు చేశారని జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య అన్నారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రైతుబంధు సంబురాలు ఘనంగా ని ర్వహించారు. మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులతో రైతుబంధు సంబురాలకు సంబంధించిన అక్షరాలను సుందరం గా తీర్చిదిద్దారు. అదేవిధంగా మార్కెట్ ఆవరణలో మార్కెట్ చైర్మన్తో కలిసి మొక్కలను నాటి నీళ్లుపోశారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ రైతులు సంతోషంగా వ్య వసాయం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రైతుబంధు ప థకాన్ని అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రై తుబంధు డబ్బులు రావడంపై రైతులు సంబురాలు నిర్వహించుకుంటున్నారన్నారు. పెట్టుబడుల కోసం ఏడాదికి ఎకరాకు రూ.10వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం 8 విడుతలుగా రైతులకు రైతుబంధు సాయం అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. మండలంలోని 9 రైతువేదికల వద్ద మొక్కలు నాటమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ సుధాకర్రెడ్డి, రైతుబంధు మండల కో ఆర్డినేటర్ జంగయ్య, జడ్చర్ల రైతుబంధు కో ఆర్డినేటర్ రవిశంకర్, కార్యదర్శి నవీన్కుమార్, ఏవో గోపినాథ్, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రైతు వారోత్సవాలు ప్రారంభం
మండలంలోని ఆలూరులో రైతు వారోత్సవాలను జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య ప్రారంభించారు. గ్రామంలోని రైతు వేదికను అందంగా అలంకరించి ముగ్గులు వేసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ సుఖన్యారెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షులు జంగయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రఘపతిరెడ్డి, రైతుబంధు జిల్లా సభ్యురాలు సలోమి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ గ్రామానా సంబురాలు
మండలంలో గ్రామ గ్రామా నా రైతు సంబురాలు కొవిడ్ నిబంధనలతో నిర్వహిస్తామని జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి తెలిపారు. శ్రీరామకొండ రైతువేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన రైతుబంధు కన్వీనర్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సమావేశంలో రైతుబంధు జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ మల్లయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, ఏవో రామకృష్ణ, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
సంబురాలను జయప్రదం చేయాలి
రైతుబంధు సం బురాలను విజయవంతం చేసేందుకు ప్ర తిఒక్కరూ కృషి చేయాలని రైతుబంధు స మితి మండల కన్వీనర్ రాజుయాదవ్ అ న్నారు. మం డలకేంద్రంలోని మం డల పరిషత్ కార్యాలయంలో రైతుబంధు సమితి ముఖ్యనాయకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6న చిత్రలేఖన, ఉపాన్యాసం, 8న మహిళలకు ముగ్గుల పోటీలు, 10న పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, విండో చైర్మన్ వెంకటయ్య, ఎంఈవో రాజునాయక్, రైతుబంధు జిల్లా డైరెక్టర్ లక్ష్మయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
‘రైతులకు భరోసా’
రైతుబంధు రైతులకు భరోసానిస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్ అన్నారు. కోడూర్లో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. రైతులతో కలిసి ఆయన పొలంలో సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మర్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, రైతుబంధు సమితి అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, సంర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీకాంత్గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.