భూత్పూర్, జనవరి 4 : దేశానికే ఆదర్శం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని కరివెన గ్రామంలో రైతుబంధు పథకం ద్వారా రూ.50వేల కోట్లు అందజేసిన సందర్భంగా కరివెనతోపాటు, మద్దిగట్ల రైతులు మంగళవారం సీఎం కేసీఆర్కు చిత్రపటానికి క్షీరాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఆల, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి ఎడ్లబండ్లు, డప్పులతో నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఆల, ఎంపీపీ శేఖర్రెడ్డి, మున్సిపల్ చై ర్మన్ బస్వరాజ్గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులుగౌడ్ తదితరులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం గ్రామంలో రూ.24లక్షల తో ని ర్మించిన రైతువేదిక వరకు భారీ ఊరేగింపుతో వెళ్లారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ దేశంలో రైతులకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది సీఎం కేసీఆర్ అన్నారు. రైతువేదికల నిర్మాణం రై తుల అత్మగౌరవాన్ని పెంచిందన్నారు. రైతువేదికల్లో వ్యవసాయాధికారులు రై తులకు సంబంధించిన పంటలపై అవగాహన కార్యక్రమాన్ని, ప్రొజెక్ట్ర్ ద్వారా రాష్ట్రస్థాయి అధికారుల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారని ఆయన తెలిపారు.
రైతుల కోసం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రన్నింగ్లోకి తెచ్చారని, దీని మూలంగానే రాష్ట్రంలో, ము ఖ్యంగా మన జిల్లాలో, మద్దిగట్ల గ్రామంలో సాగునీరు పు ష్కలంగా వస్తుందని ఆయన చెప్పారు. జిల్లా రైతులను ఆ దుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేశారని, మండలంలోని కరివెనకు రూ.2500కోట్లతో ప్రాజెక్టును మంజూరు చేశారన్నా రు. ప్రాజెక్టు దాదాపు 80శాతం పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ప్రాజెక్టుపై ప్రతిపక్షాలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు 194 కేసులు వేశారన్నారు. ఎన్ని కేసులు వేసినా ప్రాజెక్టును కట్టి జిల్లాను సస్యశ్యామ లం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమం లో వైస్ ఎంపీపీ నరేశ్, సర్పంచులు, ఎంపీటీసీ నిర్మల, ఏడీ ఏ యశ్వంత్రావు, ఏవో మురళీధర్, కౌన్సిలర్లు, ఏఈవో హారిక, నాయకులు తదితరులు పాల్గొన్నారు.