యాసంగి సీజన్లో రైతులకు శుభవార్త అందింది. పంటలకు మద్దతు ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో యాసంగిలో సాగు చేపట్టే రైతన్నలకు లబ్ధి చేకూరనున్నది. ఈ సీజన్లో పండించిన వివిధ రకాల పంటలను గతేడాదికి మించి ధరకు విక్రయించవచ్చు. ఇందులో పప్పు ధాన్యాల పంటలే ప్రధానంగా ఉండటం గమనార్హం. యాసంగిలో వేరుశనగకు గతేడాదితో పోలిస్తే రూ.300 వరకు ధర పెరిగింది. పత్తికి తేమ శాతం మేరకు ధర నిర్ణయించనున్నారు. దీంతో కర్షకులు ఆనందం
వ్యక్తం చేస్తున్నారు.
నాగర్కర్నూల్ , నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : యాసంగి సీజన్కు సన్నద్ధమవుతున్న రైతులు సంబురపడేలా ప్రభుత్వం తీపికబురు అందించింది. కేంద్రం యాసం గి పంటలకు మద్దతు ధరలను పెంచింది. వానకాలం సీజన్ లో సాగుచేసిన వరి, పత్తి తదితర పంట లు చేతికొచ్చాయి. మార్కెట్లో రై తులు పత్తిని విక్రయిస్తుండగా ఈ నెలలోనే వరి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఇలా వానకాలం సాగు ముగిసి.. యాసంగికి సన్నద్ధమవుతున్న వేళ మద్దతు ధరలు ప్రకటించడంతో.. దానికి అనుగుణంగా రై తులు పంటలను పండించుకునే అవకాశం ఏర్పడింది.
గతేడాదితో పోలిస్తే ఈ సారి పంటల ధరలు పెరగడం గమనా ర్హం. నాగర్కర్నూల్ జిల్లాలో 3.55 మెట్రిక్ టన్నుల పత్తి ది గుబడి అంచనా కాగా, ఇందుకోసం 15 కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే, ఈ సీజన్లో పంటల సాగు అంచనా కూడా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. జి ల్లాలో అత్యధికంగా వేరుశనగ సాగు చేపట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో గత యాసంగి సీజన్లో 2.54 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగితే.. ఈ సారి 2.86 లక్షల ఎకరాల్లో సాగు అంచనాలు రూపొందాయి. గతేడాది వేరుశనగ 1.49 లక్షల ఎకరాలుండగా.. ఈసారి 1.64 లక్ష ల ఎకరాల్లో ప్రాధాన్యత పంటగా సాగు కానున్నది.
ఆ త ర్వాతి స్థానంలో 82 వేల ఎకరాల్లో వరి.., జొన్న, మొక్కజొన్న, కందులు వంటి పంటలు ఉన్నాయి. కాగా, ఈ పంటలకు అనుగుణంగా మద్దతు ధరలు ఖరారు కావడం విశేషం. ఇప్పటికే పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తేమ శాతం బట్టి మద్దతు ధరలు ఖరారు కాగా.. మార్కెట్లో మంచి డి మాండ్తో కొనుగోళ్లు జరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కొనుగోలు కేంద్రాలకు మించి మద్దతు ధరలు సైతం వచ్చే అవకాశమున్నది. తెలంగాణలో ప్రతి వానకాలం, యా సంగి సీజన్లలో వరి, పత్తి, వేరుశనగ వంటి పంటల సాగు విస్తీర్ణం ఏడాదికేడాది పెరుగుతున్నది.
ప్రభుత్వం రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచు తున్నది. అలాగే రైతులకు ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు చెరువులను నింపడంతో నీటి సమస్యను తీర్చింది. అలాగే 24 గంటల విద్యుత్తోపాటు రైతుబంధు, రైతుబీ మా వంటి పథకాలు పంట చేతికి వచ్చాక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. దీంతో గ్రామాల్లో వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. కాగా, ప్రభుత్వ మద్దతు ధరలతో బ యట మార్కెట్లో డిమాండ్ వస్తున్నది. ప్రభుత్వం ఈ ధర లు నిర్ణయించకుంటే వ్యాపారులు సిండికేట్గా మారి రైతు లు తక్కువకే పంటలు అమ్ముకునే పరిస్థితులు ఏర్పడతాయి.