మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 3 : స్వచ్ఛ తెలంగాణలో భాగంగా ప్రభుత్వం గ్రామాల నుంచి పట్టణాల వరకు వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించేలా ప్రో త్సహిస్తున్నది. ఇందుకోసం ముఖ్యంగా మున్సిపాలిటీలపై ప్రత్యే క దృష్టి సారించింది. మరుగుదొడ్లను నిర్మించడంతో పాటు వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నది. ఈ విషయంపై ప్రభుత్వం విజ యం సాధించింది. కాగా, మరుగుదొడ్డిలోని మురుగును తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నది. ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు మున్సిపాలిటీలను ఎంచుకున్నది. ఇప్పటికే వరంగల్ కార్పొరేషన్, సిరిసిల్ల మున్సిపాలిటీతోపాటు పలు బల్దియా ల్లో ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 71 బల్దియాలకు సీడీఎంఏ బడ్జెట్ కేటాయించింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 9 బల్దియాలను ఏడు ప్యాకేజీలుగా విభజించారు.
స్వచ్ఛత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా సెప్టిక్ ట్యాంకుల్లోని వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి చర్యలు చేపట్టింది. ఇందుకోసం ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే వరంగల్ కార్పొరేషన్, సిరిసిల్ల మున్సిపాలిటీతోపాటు పలు ప్రాంతాల్లో విజయవంతంగా నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల, బాదేపల్లి, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్, వనపర్తి బల్దియాల్లో రూ.17.99 కోట్లతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. సిబ్బందికి అవగాహన కల్పించేందుకు అధికారులు ఆస్కీ కన్సల్టెంట్కు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.
పాలమూరులో ఇప్పటికే సిద్ధం కాగా.. శుక్రవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించనున్నారు.
– మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 3
వరంగల్ కార్పొరేషన్, సిరిసిల్ల మున్సిపాలిటీలో ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటుచేశారు. మలం, మూత్రంతో ఎరువులు, నీటిని తయారుచేయడంలో సక్సెస్ రేట్ సాధించారు. దీంతో మిగతా పురపాలికల్లో ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పట్టణంలో ఉన్న మురుగునీటిని ప్లాంట్లకు తరలించేలా స్థానిక పారిశుధ్య విభాగం పనిచేయాల్సి ఉంటుంది. వేస్టేజీతో పంటలకు అవసరమయ్యే ఎరువులను ప్లాంట్లలో తయారు చేయనున్నారు. ప్లాంట్ల నిర్వహణను టెండర్ల ద్వారా అప్పజెప్పనున్నారు. సుమారు 1,500 లీటర్ల మురుగు పదార్థాలను బయటకు తీస్తే.. అందులో 13 వేల లీటర్ల వాటర్, 2 వేల కిలోల ఎరువు రూపంలో బయటకు వస్తుంది. మున్సిపాలిటీలతోపాటు చుట్టు పక్క గ్రామాల్లోని మరుగుదొడ్డి వేస్టేజీని కూడా ఈ ప్లాంటుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో నుంచి వచ్చే నీటిని మొక్కలు, ఇతర అవసరాలకు వినియోగించనున్నారు. ఎరువులను మాత్రం పంటలకు వాడుతారు. ఇలా చేయడంతో స్వచ్ఛత, వాతావరణ సమతుల్యానికి దోహదపడుతుంది. 400 చదరపు అడుగుల్లో ప్లాంటును ఏర్పాటుచేసి.. చుట్టూ పచ్చదనం కనిపించేలా పార్కులు ఏర్పాటు చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా, టెక్నాలజీ నాలెడ్జ్ (ఆస్కీ)కి ఈ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ప్లాంట్ను సిద్ధం చేశారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో రూ.17.99 కోట్లతో ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. అధికారులు, సిబ్బందికి దీనిపై అవగాహన కల్పించేందుకు ఆస్కీ కన్సల్టెంట్కు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ప్యాకేజీ-1లో మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల, బాదేపల్లి, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్, వనపర్తి మున్సిపాలిటీల్లో ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు. మహబూబ్నగర్లో 50 కిలోలీటర్లు (కేఎల్డీ), గద్వాల, వనపర్తిలో 20 కిలోలీటర్లు(కేఎల్డీ), మిగతా మున్సిపాలిటీల్లో 10 కిలోలీటర్ల (కేఎల్డీ) కెపాసిటీతో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మహబూబ్నగర్ మున్సిపాలిటీ మౌలాలీగుట్టలో ఎకరా స్థలంలో ప్లాంట్ ఏర్పాటుకు స్థలం గుర్తించి.., దాదాపు రూ.5 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేశారు. నేడు ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి
శ్రీనివాస్గౌడ్ ప్లాంట్నుప్రారంభించనున్నారు.
మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలోని మౌలా లీ గుట్టలో ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం ఎకరా స్థలా న్ని గుర్తించాం. ప్లాంట్ను నిర్మించాం. ఆస్కీ సంస్థ వా రే ట్రీట్ప్లాంట్ నిర్వహణ చే పడుతారు. పట్టణంలో సెప్టి క్ ట్యాంక్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. ప్లాంట్ ఏర్పాటుతో ఎన్నో ప్ర యోజనాలు ఉన్నాయి. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌ డ్ శుక్రవారం ప్లాంట్ను ప్రారంభించనున్నారు.
– ప్రదీప్కుమార్, మున్సిపల్ కమిషనర్,మహబూబ్నగర్