వనపర్తి, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఉప ఎన్నికలో ఫలానా పార్టీయే గెలుస్తుంది..? లేదు లేదు.. మరోపార్టీదే విజయం.. అంటూ ఎక్కడ చూసినా మునుగోడు ఎలక్షన్పైనేచర్చ జరుగుతున్నది. పల్లె నుంచి పట్నం వరకు రాజకీయ వేడి నెలకొన్నది. ఇదే అదునుగా పందెం రాయుళ్లు రంగంలోకి దిగారు. ఫలానా పార్టీ గెలుస్తుందని బాహాటంగానే బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఔత్సాహికులు పాల్గొని రూ.వేల నుంచి రూ.లక్ష వరకు పందెం కాస్తున్నారు. టీఆర్ఎస్,బీజేపీ, కాంగ్రెస్ పార్టీలదే గెలుపు.. కాయ్ రాజా.. కాయ్.. అంటూ బెట్టింగ్కు పాల్పడుతున్నారు. ఆయా పార్టీలపై అభిమానం, గెలుపోటములపై అవగాహన, విశ్లేషణ ఆధారంగా బెట్టింగ్కు ముందుకొస్తున్నారు. ఒకరికొకరు వాగ్వాదానికి సైతం దిగుతున్నారు. కారు గుర్తే గెలుస్తుందని
ఎక్కువగా పందెం కడుతున్నారు. రూ.కోట్లల్లో చేతులు మారుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడనే ఆరోపణలు లేకపోలేదు.
ము నుగోడు ఉప ఎన్నికల వేడి జిల్లాను తాకింది. రోజురోజుకూ సెగ రగిలిస్తూ గెలుపోటములపై తీవ్ర చర్చ జరుగుతున్న ది. మామూలు రాజకీయ పరిజ్ఞానం ఉ న్న వారిలో ఏ ఇద్దరు కలిసినా మునుగోడు ఎలా ఉంది? ఏ పార్టీ గెలుస్తుంది? అని ఆరా తీస్తున్నారు. కొందరు ఫలానా పార్టీనే గెలుస్తుందని.., ఇతర పార్టీలు గెలిచే పరిస్థితి లేదని వాగ్వాదానికి దిగుతున్నారు. ఇక ఫలానా పార్టీ మాత్రమే గెలుస్తుందని బాహాటంగా పందెం కాస్తున్నారు. యువత నుంచి వృద్ధుల వరకు వారి ఆర్థికస్థితిని బట్టి పందెం కాస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్న నేపథ్యంలో బెట్టింగ్లన్నీ ఈ మూడు పార్టీల మీదనే జరుగుతున్నాయి. పార్టీలపై అభిమానం, గెలుపోటములపై అవగాహన, విశ్లేషణ ఆధారంగా బెట్టింగ్ కడుతున్నారు.
రూ.లక్షల్లో బెట్టింగ్లు..
ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యలో బెట్టింగ్ జోరు జిల్లాలో ఎక్కువైంది. రూ. వెయ్యి మొదలుకొని రూ.లక్షల్లో బెట్టింగ్ జరుగుతున్నది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ గెలుస్తుంది..? గెలిచిన పార్టీకి ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుందన్న వాటిపైనే పందేలు కాస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఎక్కువగా బెట్టింగ్ కడుతున్నారు. మంగళవారం సాయంత్రం ప్రచారం ముగుస్తుండడంతో జిల్లా నుంచి వివిధ పార్టీల తరఫున ప్రచారానికి వెళ్లిన నాయకులు అక్కడి పరిస్థితిని అంచనా వేసి బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం. ప్రచారంలో ఉన్న నాయకుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని ఎక్కువ మంది బెట్టింగ్ వేస్తున్నారు. మునుగోడులో బీజేపీకి క్యాడర్ లేకపోవడం, టీఆర్ఎస్ సంక్షేమ పథకాలతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అక్కడే ఉండి ప్రచారం చేయడంతో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని పందెంరాయుళ్లు భావిస్తున్నారు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఒక వ్యాపారి మరో వ్యాపారితో బీజేపీ ఓటమి పాలవుతుందని, టీఆర్ఎస్ గెలుస్తుందని రూ.ఐదు లక్షల బెట్టింగ్ కట్టినట్లు తెలిసింది. అయితే, టీఆర్ఎస్ ఓడిపోతే రూ.ఐదు లక్షలు ఇస్తానని.., బీజేపీ ఓడిపోతే రూ.రెండున్నర లక్షలు ఇస్తే చాలని బెట్ కట్టినట్లు సమాచారం. టీఆర్ఎస్ పక్కా గెలుస్తుందనే నమ్మకం తో అలా బెట్టింగ్ కట్టినట్లు మిత్రులతో చెప్పుకొన్నాడు. ఇలా చాలా మంది పందెం కాస్తున్నారు. కాంగ్రెస్పై ఏ ఒక్కరూ బెట్ కట్టకపోవడం శోచనీయం.
లబ్ధిదారుల ఆనందం చెప్పలేనిది..
కేసీఆర్.. ఉద్యమ సమయంలో గ్రామగ్రామాన తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. స్వరాష్ట్రం సిద్ధించాక పేదలకు అగ్గిపెట్టె లాంటి ఇండ్లుకాదు.. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాలని డబుల్ బెడ్రూం ఇండ్లకు రూపకల్పన చేశారు. అనుకున్నట్లే నియోజకవర్గానికి ఇండ్లు కేటాయించారు. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, అధికారుల సహకారంతో వెయ్యి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చామన్న తృప్తి కలుగుతుంది. వారి కండ్లలో చూస్తున్న ఆనందాన్ని ఎప్పటికీ మరవలేను. వారి సంతోషం చూశాక ఎంత చేసినా తక్కువే అనిపిస్తున్నది. ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ను లబ్ధిదారులు దేవుడిలా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రుణం జీవితాంతం గుర్తుంచుకుంటామని చెబుతున్నారు.
– ఆల వెంకటేశ్వర్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే