మహబూబ్నగర్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) :ఇక అన్ని గ్రామాల్లో ఈ-గవర్నెన్స్ అమలు కానున్నది. పేపర్ రహిత సేవలు అందించేందుకుప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి సమస్యనూ ఆన్లైన్లోనే పరిష్కరించనున్నది. పంచాయతీ కార్యదర్శికి ఈ బాధ్యతలను అప్పగించనున్నది. ప్రతి పంచాయతీకి టీ-ఫైబర్ కనెక్షన్లో భాగంగా హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించనున్నది. కంప్యూటర్ లేని పంచాయతీలు జనరల్ ఫండ్తో కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. దీంతో మరింత పారదర్శకంగా సేవలు అందనుండగా.. మండల కేంద్రాలకు రావాల్సిన అవసరం లేకుండానే పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నది.
మారుమూల గ్రామాల్లో ఈ-గవర్నెన్స్కు ప్ర భు త్వం శ్రీకారం చుట్టనున్నది. ప్రతి సమస్యనూ పేపర్ ర హితంగా ఆన్లైన్లోనే పరిష్కరించాలనే ఉద్దేశంతో అన్నింటినీ ఇంటర్నెట్ పరిధిలోకి తీసుకురానున్నది. ఇప్పటికే ఆ యా జిల్లాల్లో అధికారులు ఆన్లైన్లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తున్న తరుణంలో.. గ్రామ స్థాయిలో కూడా ఇదే పద్ధతిని అవలంబించి ప్రతి అధికారీ జవాబుదారీతనం ఉండేలా అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాలకు టీ ఫై బర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారులు, ఫైబర్ ఇన్చార్జిలతో కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునేలా సర్పంచ్లకు అధికారులు అవగాహన కల్పించడంతోపాటు సహాయ స హకారాలు అందిస్తున్నారు. కంప్యూటర్ వంటి పరికరాలు లేని పంచాయతీల్లో కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చా రు. ఫైబర్ కనెక్షన్ ఇచ్చాక గ్రా మాలన్నీ ఈ-గవర్నెన్స్లోకి వెళ్లనున్నాయి. దీంతో ప్రజలు తమ ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసుకొని.. ఏఏ అధికారి వద్ద పెండింగ్లో ఉందో తెలుసుకోవచ్చు. సదరు అధికారి పరిష్కరించకుంటే ఉన్నతాధికారులకు ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసుకునే వెసలుబాటు కల్పిస్తున్నారు.
కాగా, అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారులు ఫైళ్లను ఆన్లైన్లోనే పరిష్కరిస్తున్నారు. ప్రతి అంశానికి సంబంధించి తా సిల్దార్ స్థాయి నుంచి ఆర్డీవో, కలెక్టరేట్ ఏవో, డీఆర్వో, అదనపు కలెక్టర్, కలెక్టర్లు.. ప్రతి ఫైల్ను ఆన్లైన్లోనే చెక్ చేస్తున్నారు. ప్రతి శాఖకు సంబంధించిన పైళ్లను ఆన్లైన్ ద్వారా స్టెప్ బై స్టెప్ పంపిస్తున్నారు. జిల్లాల్లో చేపట్టిన ఈ-గవర్నెన్స్లపై కేంద్ర అవార్డులు కూడా దక్కాయి. మహబూబ్నగర్ జిల్లాలో అన్ని శాఖల మధ్య సాగుతున్న ఈ-గవర్నెన్స్ను ఇటీవల కేంద్ర బృందం పరిశీలించింది. ఈ- గవర్నెన్స్ ద్వారా ఫైళ్లు మిస్ అయ్యే అవకాశాలు లేవు. గ తంలో కింది స్థాయి నుంచి కలెక్టరేట్ వరకు ఫైళ్లను ప్రత్యేక మెసెంజర్స్ను పంపాల్సి వచ్చేది. ఈ-గవర్నెన్స్ ద్వారా పైళ్లను ఎప్పటికప్పుడు వేగంగా పరిష్కరించే అవకాశం ఉన్నది. మహబూబ్నగర్ జిల్లాలోని 14 మండలాలు, 391 పంచాయతీల్లో టీ ఫైబర్ దాదాపుగా పూర్తి కావచ్చింది.
ప్రతి శాఖకు సంబంధించిన సమస్యలను ప్రజలు ఆ న్లైన్లోనే పరిష్కారం పొందే అవకాశం ఉన్నా.. ఉపయోగించుకోవడం లేదు. దీంతో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి వచ్చే ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఆన్లైన్ లో నమోదు చేయడంతోపాటు రశీదు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఐడీ నంబర్ కేటాయించి.. సంబంధిత అధికారులకు పంపిస్తున్నారు. ప్రజావాణికి రాకుండానే ఆన్లైన్లో సమస్యలను విన్నవించుకోవచ్చు. కానీ, సరైన అవగాహన లేకపోవడంతో జిల్లా కేంద్రాలకు వస్తున్నారు. ఇక గ్రామాల్లో మీ సేవా కేంద్రాలు లేకపోవడం.. మండలాల్లో ని మీ సేవ ఆపరేటర్లకు అవగాహన లేకపోవడంతో సమ స్య పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల ప్రభుత్వం గ్రా మస్థాయిలో మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు కూడా అవకాశం కల్పించింది.
నెలాఖరుకల్లా టీ ఫైబర్ కనెక్షన్..
రాష్ట్ర ప్రభుత్వం టీ ఫైబర్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అందజేస్తున్నది. జిల్లా, మండల కేంద్రాల్లో పూర్తయింది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా అన్ని పంచాయతీలకు టీ ఫైబర్ కనెక్షన్లు ఇస్తాం. గ్రామస్థాయిలో ఈ-గవర్నెన్స్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సర్పంచులు, అధికారులకు అవగాహన కల్పించాం. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. కంప్యూటర్లు లేని పంచాయతీలు వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చాం. వందశాతం టీ ఫైబర్ సేవలు ఉపయోగించుకోవాలి.
– ఎస్.వెంకట్రావు, కలెక్టర్, మహబూబ్నగర్
టీ ఫైబర్తో విప్లవాత్మక మార్పు..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీలో హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కోట్లాది రూపాయల ఖర్చు చేసి టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్లు ఇస్తున్నది. దీంతో సులభంగా అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఏర్పడి పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం కానున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలకేంద్రాల్లో ఇంటర్నెట్కు బదులు టీ ఫైబర్ను యాక్టివేట్ చేశారు. నెలాఖరుకల్లా అన్ని పంచాయతీలకు కనెక్షన్లు ఇవ్వనున్నారు. దీనిపై సర్పంచులు, ఎంపీవోలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ-గవర్నెన్స్ అందుబాటులోకి వస్తే గ్రామ కార్యదర్శి ద్వారా అన్ని సేవలు పంచాయతీలోనే పొందొచ్చు.