వనపర్తి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నా యి. చలి తీవ్రత పెరిగింది. రెండ్రోజుల కిందట రాత్రివేళల్లోనే చలి ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఉదయం కూడా ప్రభావం చూపుతున్నది. రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వ రకు బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నారు. చలికాలం ప్రారంభమై దాదాపు 20 రోజులవుతున్నది. వర్షాలు తగ్గడంతో చలి తడా ఖా చూపుతున్నది. వాతావరణంలో అకస్మాత్తు గా మార్పులు రావడంతో ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాసకోస వ్యాధులు వస్తాయని, ఆస్తమా పేషెంట్లకు ఇబ్బందయ్యే పరిస్థితి ఉంటుందంటున్నారు. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతలు న మోదవుతున్నా.. సాయంత్రం ఒక్కసారిగా పడిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 20 డిగ్రీల సెల్సియస్లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న మూడు రోజులు మరింత ప్రభావం చూపే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. వనపర్తి జిల్లాలో గరిష్ఠంగా 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠంగా 17.1 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నాయి. చలి తీవ్రత పెరుగుతుండడంతో రాత్రి వేళల్లో ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. ఉదయం పూట మంచు ఉండడం.., సూర్యోదయం కూడా ఆలస్యం అవుతుండడంతో లేటుగా నిద్రలేస్తున్నారు. ఆలస్యంగా పనుల్లోకి వెళ్తున్నారు. వనపర్తి జిల్లాలో.. గోపాల్పేట మండల కేంద్రంలో గరిష్ఠంగా 31.3 , కనిష్ఠంగా 17.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. పాన్గల్ మండలం కేతేపల్లిలో కనిష్ఠంగా 17.6, ఖిల్లాఘణపురం మండలం సోలీపూర్, జిల్లా కేంద్రంలో 17.7 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నది. మదనాపురంలో 18.0, వీపనగండ్లలో 18.3, రేవల్లిలో 18.4, ఆత్మకూర్, కొత్తకోటలో 18.6, చిన్నంబావిలో 18.8, అమరచింత, శ్రీరంగాపూర్లో 18.9, పెద్దమందడిలో 20.1 డిగ్రీల సెల్సియస్ ఉన్నది. పగటిపూట అన్ని మండలాల్లో 31 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్కెట్లో స్వెట్టర్లకు గిరాకీ పెరుగుతున్నది. నేపాల్ నుంచి దిగుమతి చేసుకునే మఫ్లర్లు, బ్లాంకెట్ల అమ్మకాలు ఎక్కువయ్యాయి. నవంబ ర్, డిసెంబర్ నెలల్లో చలి తీవ్రత ఇంకా ఎక్కువ కానున్నది. లిప్బామ్లు, చర్మం పొడిబారకుం డా ఉండేందుకు జెల్లు, వాజ్లెన్లు, బామ్ లు కొనుగోలు చేస్తున్నారు.