పాలమూరు, అక్టోబర్ 27 : ప్రభుత్వ లేఅవుట్లయిన పోతులమడుగు టౌన్షిప్, సారికా టౌన్షిప్ ప్లాట్లకు నిర్వహించే వేలంలో పాల్గొని సొంతం చేసుకోవాలని కలెక్టర్ వెం కట్రావు అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భూత్పూర్ ము న్సిపాలిటీలోని సారికా టౌన్షిప్, మండలంలోని పోతులమడుగు టౌన్షిప్ల్లో ఉన్న ఓపెన్ ప్లాట్లకు నవంబర్లో ప్రత్యక్ష వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. సారికా టౌన్షిప్లో 320 ఓపెన్ ప్లాట్లకు రెండు విడుతల్లో వేలం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో 186 ఓపెన్ ప్లాట్లకు నవంబర్ 14,15 తేదీల్లో జిల్లా కేంద్రంలోని బాదం రామస్వామి ఆడిటోరియంలో ప్రత్యక్ష వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్లాట్లు 60గజాలు మొదలుకొని 260 గజాల వర కు ఉన్నాయన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర రూ.8వేల నుంచి వేలం ప్రారంభమవుతుందన్నారు. కలెక్టరేట్ సమీపంలోనే సారికా టౌన్షిప్ ఉండటంతో అన్నివిధా లా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు.
అంతేకాక భూత్పూ ర్ మున్సిపాలిటీలోని ఏడోవార్డులో కలిపినట్లు పేర్కొన్నారు. అలాగే భూత్పూర్ మండలంలోని పోతులమడుగు వద్ద 20 ఎకరాల్లో ఓపెన్ ప్లాట్లు ఉన్నాయని తెలిపారు. ఈ రెండు టౌన్షిప్ల్లో తక్కువ ధరకు ప్రభుత్వ అనుమతి పొందిన లేఅవుట్లో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వేలం లో పాల్గొనేందుకు రూ.10వేల ఈఎండీని కలెక్టర్ పేరుమీద డీడీ రూపంలో చెల్లించాలని తెలిపారు. వేలంలో ప్లాట్లు పొం దినవారు ఏడురోజుల్లోగా కొనుగోలు చేసిన మొత్తం విలువలో మొదటి విడుత 33శాతం, 45రోజుల్లో 33శాతం, మిగతా మొత్తాన్ని 90రోజుల్లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒకేసారి ప్లాట్ మొత్తం విలువ చెల్లించిన వారికి 2శాతం మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో గృహనిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వైద్యం భాస్కర్, రాజీవ్ స్వగృహ మేనేజర్ నజీర్, ఎల్డీఎం భాస్కర్ ఉన్నారు.